యాప్నగరం

సంతోషమైనా, దు:ఖమైనా ఒకటే సూత్రం

మాయా జూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయిన పాండవులు రాజ్యాన్ని కోల్పోవడంతో షరతులు ప్రకారం పన్నెండేళ్లు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాత వాసం చేయాలి.

TNN 17 May 2017, 9:44 pm
మాయా జూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయిన పాండవులు రాజ్యాన్ని కోల్పోవడంతో షరతులు ప్రకారం పన్నెండేళ్లు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాత వాసం చేయాలి. అరణ్యవాస చేస్తున్నప్పుడు తీవ్ర మనోవేదనతో ధర్మరాజు చింతిస్తున్న తరుణంలో శ్రీకృష్ణుడు అక్కడకు వెళ్లాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించిన ధర్మజుడు 'కృష్ణా! నా మనసు తీవ్ర శోకంతో నిండిపోయింది.... ఏం చేయాలో పాలుపోక అయోమయంగా, అగమ్యగోచరంగా ఉంది. ఈ పరిస్థితి నుంచీ నీవే గట్టెంకిచాలని వేడుకున్నాడు. నీ మనోవేదనకు కారణం ఏంటని యుధిష్ఠరుని శ్రీకృష్ణుడు అడిగాడు.
Samayam Telugu mahabharata lord krishna told sad and happies are equal
సంతోషమైనా, దు:ఖమైనా ఒకటే సూత్రం


ఆపద్బాంధవా నీకు తెలియంది ఏముంది? జూదంలో సర్వం కోల్పోయి, రాజ్యాన్ని వదులుకుని అడవుల బాట పట్టాను. అయినా మమ్మల్ని హతమార్చాలని దుర్యోధనాదులు అనేక కుట్రలు చేస్తున్నారు. సమయానికి నీవు కాపాడకపోతే మా పరిస్థితి ఏంటి, వారి చర్యలు తలచుకుంటే దుఃఖం భరించలేకపోతున్నాను. నాకు ఏదైనా ఔషధాన్ని ఇచ్చి ఉపశమనం కలిగించు అని ధర్మరాజు ప్రాధేయపడ్డాడు.

కృష్ణ పరమాత్మడు ఓ పత్రం మీద ఏక వాక్యం రాసి ఇచ్చి నీకు బాగా సంతోషం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు దీనిని మననం చేయమని అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ పత్రంపై ఏమని రాశాడంటే 'ఇది ఎప్పుడూ ఇలాగే ఉండదు' అంటే సంతోషమైనా, దుఃఖమైనా ఎప్పుడూ శాశ్వతం కాదని అర్థం. దీనిలో పరమార్థాన్ని గ్రహించిన ధర్మరాజు కృతజ్ఞతపూర్వకంగా నమస్కారం చేశాడు.

మనది కాని దానిని మనదిగా భావిస్తే దుఃఖానికి కారణమవుతుందని పెద్దలు అంటారు. వాస్తవానికి తాను ఆత్మస్వరూపుడనని, కానీ శరీరంలో ఇంద్రియలే ప్రాణమనే బుద్ధితో భావించడం వల్ల మానవుడు సుఖదుఃఖాలు పొందుతున్నాడు. కర్తవ్య భావాలే జీవుడిని బంధిస్తున్నాయని తెలుసుకుని, నిశ్చయజ్ఞానంతో జీవిస్తూ, వాస్తవిక స్థితిని అనుభూతి చెందినప్పుడే మోక్షం లభిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.