యాప్నగరం

భారతాన్ని వ్యాసుడు వినిపిస్తే, గణపతి రాస్తూ...

వేదవ్యాసుడుగా పిలువబడే కృష్ణ ద్వైపాయనుడు గొప్ప రుషి. వ్యాసుడు మహాభారత గ్రంథకర్త మాత్రమే కాదు, వేదాలను కూడా సంకలనం చేశాడు.

TNN 23 Jul 2017, 4:29 pm
వేదవ్యాసుడుగా పిలువబడే కృష్ణ ద్వైపాయనుడు గొప్ప రుషి. వ్యాసుడు మహాభారత గ్రంథకర్త మాత్రమే కాదు, వేదాలను కూడా సంకలనం చేశాడు. వేదాలు 1,00,000 ఏళ్లకు పూర్వమే ఉన్నాయని భావిస్తారు. వీటిని ఒక తరం నుంచి ఇంకొక తరానికి మౌఖికంగానే ప్రచారం చేశారు. శబ్ద ప్రాముఖ్యత, ప్రభావం అర్ధం చేసుకున్నారు కాబట్టి వీటిని లిఖించడానికి వారు నిరాకరించారు. భౌతికంగా మన వాడుకలో ఉన్న వాటన్నింటిలోకీ సూక్ష్మమైనది శబ్దం. విద్యుదయస్కాంత శక్తి దీని పైస్థాయికి చెందింది. మన మెదడులో తిరిగేది కూడా ఇదే శక్తి. ఆలోచనలకూ, భావాలకూ ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వలేదు. అతి సూక్ష్మమైన శబ్దం ప్రాముఖ్యతను తెలుసుకుని ఎంత ప్రభావవంతంగా దానిని ఉపయోగించుకోవచ్చో గుర్తించారు.
Samayam Telugu mahabharata vedavysa reveals this story to only two persons
భారతాన్ని వ్యాసుడు వినిపిస్తే, గణపతి రాస్తూ...


గంగాతీరంలో వచ్చిన 14 సంవత్సరాల సుదీర్ఘ కరవు వరకూ వేదాలను మౌఖికంగా పలకడమే సంప్రదాయం. ఆ సమయంలో ఒక్క చుక్క వర్షం పడలేదట. పంటలు ఎండి పోయాయి, ఆ నాటి నాగరికత కుంచించుకు పోయింది. జీవించడానికి ఆహార సేకరణలో పడిపోయి ప్రజలు వేదాలను వల్లెవేయటం మర్చిపోయారు. తమ సంప్రదాయాలను పూర్తిగా వదులుకున్నారు. వర్షాలు తిరిగి కురిసిన తర్వాత వేదాలు లేకపోవడం వల్ల ఈ నాగరికతకి జరిగిన నష్టం చూసిన వ్యాసుడు వాటిని లిఖితరూపం ఇవ్వాలని నిశ్చయించాడు. వీటిని ఋగ్వేదం, అథర్వణ వేదం, సామ వేదం, యజుర్వేదం అనే నాలుగు భాగాలుగా విభజించారు. ఇది సంప్రదాయ క్రమం, ఈ రోజుల్లో చెప్పేవరుస క్రమం కాదు. ఈ నాలుగు వేదాలూ నేటికీ మానవ చరిత్రలోని అతి గొప్ప లిఖిత ప్రతులుగా పరిగణింపబడ్డాయి.

ఆ తర్వాత అన్ని కాలాల ప్రజలకీ యుక్తమైన ఒక శాశ్వత గ్రంథాన్ని రచించాలని ఆయన సంకల్పించారు. దీనిని ఇద్దరికి వినిపించాడు. వీరిలో ఒకరు అయన శిష్యుడు వైశంపాయనుడు. ఈయన పూర్తివిస్మయంతో విన్నాడు, శిష్యులకి వక్రీకరించే అవకాశం ఉందని మీకూ తెలుసు. సత్య యుగంలో మానవులకు మానసిక శక్తి ఎక్కువగా ఉన్నందున మౌఖికంగా ప్రసారం చేయడానికి తగిన ఙ్ఞాపకశక్తి కలిగి ఉన్నారు. కలియుగం సమీపిస్తున్న కొద్దీ మానవ మానసిక, ఙ్ఞాపక శక్తి తగ్గడంతో వ్యాసుడు ఇక ఎలాంటి అవకాశాలకూ ఆస్కారం లేకుండా రెండో వ్యక్తి గణపతిని పిలిచి వేదాలను లిఖితం చేయడానికి పూనుకున్నాడు.

ఒకరు రాస్తుంటే, ఇంకొకరు వింటున్నారు. దురదృష్టవశాత్తూ ఆ రచన ఎంతో అందంగా ఉండటం దేవతలు వచ్చి దానిని దొంగిలించుకొని పోయారు. ఈ రోజు మనకు తెలిసిన మహాభారతం వైశంపాయనుడికి ఙ్ఞప్తికి ఉన్నది మాత్రమే. గణపతి లిఖించింది మాత్రం కాదు..!. కురుక్షేత్రం యుద్ధం ముగిసిన తర్వాత వైశంపాయనుడు మహాభారత కథను యుథిష్టరుడి రెండో తరం వారసుడు, హస్తినాపురం చక్రవర్తి జనమేజయునికి వివరించాడు. మనకు ఇప్పుడు తెలిసిన 100,000 పద్యాలు వ్యాసుడు చెప్పిన వాటిలో కొద్ది భాగం మాత్రమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.