యాప్నగరం

కృష్ణుడు యుద్ధాన్ని సమర్ధించలేదు సరికదా...

మహాభారత యుద్ధం ఎటువంటి పరిస్థితిని కల్పించిందంటే... ఏ ఒక్కరూ తటస్థంగా ఉండే అవకాశం లేదు. ఏదో ఒక పక్షం వహించాల్సిన స్థితి.

TNN 24 Jul 2017, 5:37 pm
మహాభారత యుద్ధం ఎటువంటి పరిస్థితిని కల్పించిందంటే... ఏ ఒక్కరూ తటస్థంగా ఉండే అవకాశం లేదు. ఏదో ఒక పక్షం వహించాల్సిన స్థితి. యాదవ వీరులు, కృష్ణుడు కూడా కురు పాండవులిద్దరిలో ఏదో ఒక పక్షంలో చేరడం అనివార్యమైంది. అయితే కృష్ణుడు ఈ యుద్ధాన్ని సమర్ధించలేదు. తటస్థంగానే ఉండాలనుకున్నాడు. కానీ అది సాధ్యం కాలేదు. భగవానుడికి హస్తినాపుర సామ్రాజ్యం పట్ల ద్వేషం లేదు. అలాగని దుర్యోధనుడిని సమర్ధించలేదు. కౌరవుల పక్షాన ఉన్న భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు లాంటి వీరులెందరో ఉన్నా వారెవ్వరికీ శత్రువు కాదు. అంతేకాదు వారికి కృష్ణుడు అంటే అమితమైన భక్తి గౌరవాలున్నాయి. కృష్ణుడికి దుర్యోధనుడు, పాండవులు రక్త సంబంధీకులు. ఒక బంధువు సహాయాన్ని అర్ధించినప్పుడు తిరస్కరించడం క్షత్రియధర్మానికి విరుద్దం.
Samayam Telugu mahabharata why lord krishna involve kurukshetra war
కృష్ణుడు యుద్ధాన్ని సమర్ధించలేదు సరికదా...


వీరులైన క్షత్రియులు క్షాత్రధర్మాన్ని, బ్రాహ్మణులు వేదధర్మాన్ని పాటించాలి. కృష్ణుడు క్షత్రియ, వేదధర్మాన్ని ఒక్కటిగా చేయాలని ప్రయత్నించాడు. దీనికి అవసరమైన నియమావళి ఏర్పరచి సంఘాన్ని క్షేమంగా ఉంచాలనుకున్నాడు. బ్రాహ్మణుడు రోజులో కొన్ని గంటలు స్థిరంగా ఓ చోట కూర్చుని వేద పఠనం చేయాలని నిర్ణయించారు. ఇదే ధర్మాన్ని క్షత్రియుడి అనుసరింమనడం బావ్యం కాదు. అతడు ఆ విధంగా చేయలేడు కూడా. ఒకవేళ క్షత్రియుడు బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించాలని ప్రయత్నిస్తే అతడు మంచి పరిపాలకుడు, గొప్ప వీరుడు కాలేడు. సంఘంలో అన్ని వర్ణాల వారికి ఎవరి ధర్మాలు వారికి ఉండేవి. అందువల్లే వేర్వేరు జాతులు, వేర్వేరు వృత్తుల వారికి తగిన ధర్మాలు నిర్దేశించారు.

అయితే కొంతకాలానికి క్షత్రియులు వారికి ఏది ఇష్టమో అదే వారి ధర్మంగా భావించడం ఆరంభించారు. ఆ భావనతో ఇతరుల ధర్మాలను, వ్యక్తులను లక్ష్యపెట్టడం మానేశారు. ఈ రకమైన ప్రవర్తనతో సమాజంలో సామరస్యానికి భంగం వాటిళ్లింది. అలాంటి సమయంలో కృష్ణుడు, వ్యాసమహర్షి సమాజంలో క్షాత్రతేజం, బ్రహ్మతేజాలను ఒకదానికి ఒకటి ఆలంబనగా చేసి అందరికీ మేలు చేయాలని సంకల్పించారు.
క్షాత్రధర్మాన్ని అనుసరించి ఒక క్షత్రియుని వద్దకు ఒక బంధువుగాని లేక మరెవరుగాని వచ్చి సహాయంకోరితే ‘లేదు’ అని చెప్పకూడదు.

అర్జున దుర్యోధనులిద్దరూ కృష్ణుడి సాయం కోరి వచ్చారు. కృష్ణుడు వారిద్దరికీ ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చాడు. కృష్ణుడు ఒక్కడు ఒకవైపు, అశేషమైన యాదవ సైన్యం ఒకవైపు. ఈ రెంటిలో ఎవరికి ఏది కావాలో ఎన్నుకోమన్నాడు. అధిక సంఖ్యాబలం కల యాదవ సైన్యాన్ని ఎన్నుకోవడమే ఉత్తమమని దుర్యోధనుడు భావించాడు. మొదట ఎన్నుకునే అవకాశం మాత్రం అతడికి ఇవ్వలేదు, దాని వల్ల అతడు విచలితుడై పోయాడు. పాండవులు కృష్ణునే సంపూర్ణంగా నమ్ముకున్నారు. ‘మా జీవితమైనా, మరణమైనా నీతోనే, నీవు లేకుండా మేము ఏమీ చేయలేమని కృష్ణుడితో ఏనాడో చెప్పారు. ఆ మాటే వారి జీవితాలకు గొప్ప ఫలితాలను అందించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.