యాప్నగరం

కోటి దీపోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్ దంపతులు

కార్తిక మాసం సందర్భంగా భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటీ దీపోత్సవాల వేడుక కన్నుల పండువగా జరుగుతోంది.

Samayam Telugu 17 Nov 2016, 7:40 am
కార్తిక మాసం సందర్భంగా భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాల వేడుక కన్నుల పండువగా జరుగుతోంది. నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో నిత్యం వివిధ ప్రత్యేక పూజలతో దైవాన్ని ఆరాధిస్తూ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన ప్రత్యేక పూజలు, కార్తిక దీపారాధనలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు.
Samayam Telugu maharashtra governor ch vidyasagar rao takes part in kartika deepotsavam
కోటి దీపోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్ దంపతులు


కార్తిక దీపారాధన అనంతరం కొనసాగిన శ్రీ వేదవ్యాస వేదపాఠశాల వారిచే వేదపఠనం, లలితాకామేశ్వరి బృందం వారి భక్తి గీతాలు, డా.సువర్చలాదేవి బృందం వారి ఆంధ్రనాట్యం, బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు ప్రవచనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.