యాప్నగరం

మహాశివరాత్రి: భక్తజన సంద్రమైన శైవక్షేత్రాలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులను దర్భనానికి అనుమతిస్తున్నారు.

TNN 13 Feb 2018, 8:22 am
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు తరలివస్తోన్న భక్తులు, మహాదేవుడికి అర్చనలు అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల మల్లిఖార్జునుడి ఆలయం మంగళవారం ఉదయం 1 గంటకే తెరచారు. ఉదయం 1.30 గంటలకు మంగళవాయిద్యాలు, 2.30 గంటలకు సుప్రభాతసేవ, విశ్వరూప దర్శనం, గోపూజ, కాలపూజ, 3 నుంచి 3.30 గంటల వరకు మంగళహారతి సేవలు నిర్వహించారు. తెల్లవారుజామున 2.30 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ దర్శనం సాయంత్రం 4.30 గంటలకు కొనసాగుతోంది. మధ్యలో సేవల కోసం కొద్ది విరామం తప్పించి, రాత్రి 2 గంటల వరకు దర్శించుకునే అవకాశం కల్పించారు.
Samayam Telugu mahashivratri 2018 celebration at ap and telangana
మహాశివరాత్రి: భక్తజన సంద్రమైన శైవక్షేత్రాలు


శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుడి ఆలయం, పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంలోని ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం భక్తులను అనుమతించారు. శ్రీముఖలింగం, మురముళ్ల, పట్టిసీమ, కుండలేశ్వరంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, చెరువుగట్టు, కాళేశ్వరం ఆలయాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాలకు భక్తుల పోటెత్తారు. శివ నామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి.
మరోవైపు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు అంగరంగ వైభంగా సాగుతున్నాయి. ఏడోరోజు గజవాహన సేవకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీభ్రమరాంభిక మల్లిఖార్జున స్వామివార్లను గజవాహనంపై దర్శించుకున్న భక్తులు భక్తవశంకరా పాహిమాం అంటూ పులకించిపోయారు.

శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు వైభంగా సాగుతున్నాయి. ప్రభుత్వం తరఫున ఏపీ దేవాయదాయ మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలను సమర్పించారు. మరోవైపు వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. సోమవారం నాడు మహాశివరాత్రి వేడుకలు వేములవాడ ఆలయంలో ప్రారంభమయ్యాయి. సుమారు 1600 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనానికి సుమారు 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.