యాప్నగరం

వీడియో: ఉజ్జయిని మహంకాళికి తలసాని బంగారు బోనం

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంగారు బోనం సమర్పించనున్నారు. సుమారు 3.8 కిలోల బంగారంతో దీనిని తయారు చేయించారు.

Samayam Telugu 27 Jul 2018, 1:27 pm
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంగారు బోనం సమర్పించనున్నారు. సుమారు 3.8 కిలోల బంగారంతో దీనిని తయారు చేయించారు. ఈ బోనం తయారీ బాధ్యతలను మానేపల్లి జువెలర్స్‌కు అప్పగించారు. దాదాపు 290 వజ్రాలు, 3.8 కిలోల బంగారాన్ని వినియోగించి, నిష్ణణాతులైన 10 మంది స్వర్ణకారులు ఈ బంగారు బోనాన్ని తీర్చిదిద్దారు. దీని తయారీకి రెండు వారాల సమయం పట్టింది. మానేపల్లి జువెలర్స్‌లో తయారుచేసిన బంగారు బోనాన్ని మంతి తలసాని శ్రీనివాస్ పరిశీలించారు. మూడు కిలోల బంగారంతో ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా చేతితోనే దీనిని తీర్చిదిద్దారు.
Samayam Telugu అమ్మవారికి తలసాని బంగారు బోనం


అమ్మవారి ఆలయంపై ఉన్న చిత్రాలనే బోనం చుట్టూ చెక్కారు. 80 వజ్రాలు పొదిగిన అమ్మవారి బోనం.. దానిపై కలశ చెంబు, దానిపై దీప ప్రతిమ ఉన్నాయి. జులై 29 న జరగనున్న బోనాల జాతరలో దీనిని సమర్పించినున్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ బంగారు బోనం ఆదివారం నాడు సమర్పిస్తారు. జులై 29 ఉదయం 8.30 గంటలకు ఆదయ్యనగర్ కమాన్ నుంచి బంగారు బోనంతోపాటు మరో 1008 బోనాలతో అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.