యాప్నగరం

కనిపించిన నెలవంక.. గురువారం నుంచే రంజాన్

ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. బుధవారం నెలవంక కనిపించడంతో... గురువారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభంకానున్నట్లు ముస్లిం మత పెద్దలు ప్రకటించారు.

Samayam Telugu 16 May 2018, 10:57 pm
Samayam Telugu Ramdon
ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. బుధవారం నెలవంక కనిపించడంతో... గురువారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభంకానున్నట్లు ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. రంజాన్ మాసం గురువారం ప్రారంభమై... జూన్ నెలలో ముగియనుంది. రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. ఈ మాసంలో రోజుకు ఐదుసార్లు నమాజ్‌తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మహ్మద్‌ ప్రవక్త హజరత్‌ రసూల్‌ ఇల్లల్లాహి మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది.

రంజాన్ మాసంలో ముస్లింలు తెల్లవారు జామున 4 గంటలకు ఆహారం తీసుకుంటారు. అనంతరం సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఎంగిలి కూడా మింగ కుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. చిన్న, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో అందరూ ఉపవాస దీక్షలో ఉంటారు. ఈ దీక్షలతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు. రంజాన్ మాసంలో ఈ ఉపవాస దీక్షలు సహారీతో ప్రారంభమై ఇఫ్తార్‌తో ముగుస్తాయి. ముస్లింలు తాము సంపాదించిన దానిలో పేదవారికి కనీసం నూటికి రూ.2.50పైసలు, గోధుమలు, సేమియా, వస్త్రాలు, బంగారం దానం చేయాలని ఖురాన్‌ చెబుతోంది. రంజాన్‌ నెలలో ఇలా దానం చేస్తే పేద వారు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు అంటుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.