యాప్నగరం

శివరాత్రి రోజు కశ్మీర్‌లో వెల్లివిరిసిన మతసామరస్యం!

కల్లోల కశ్మీరంలో పరమత సహనం వెల్లువిరుస్తోంది. 90 వ దశకంలో తీవ్రవాదులకు బయపడి లోయ నుంచి వెళ్లిపోయిన పండిట్లను తిరిగి రావాలంటూ అక్కడ ముస్లిం సోదరులు కోరుకుంటున్నారు.

TNN 27 Feb 2017, 6:12 pm
కల్లోల కశ్మీరంలో పరమత సహనం వెల్లువిరుస్తోంది. 90 వ దశకంలో తీవ్రవాదులకు బయపడి లోయ నుంచి వెళ్లిపోయిన పండిట్లను తిరిగి రావాలంటూ అక్కడ ముస్లిం సోదరులు కోరుకుంటున్నారు. దీనికి బందీపొర శివాలయంలో మహాశివరాత్రి రోజు జరిగిన సంఘటనే నిదర్శనం. తీవ్రవాదులకు బయపడి కశ్మీర్ పండిట్స్ అక్కడ నుంచి తరలిపోవడంతో హిందూ దేవాలయాల సంరక్షణ ముస్లిం సోదరులే చూసుకుంటున్నారు.
Samayam Telugu muslims in kashmir celebrate maha shivratri request kashmiri pandits to come back home
శివరాత్రి రోజు కశ్మీర్‌లో వెల్లివిరిసిన మతసామరస్యం!


ఈ ఏడాది బందీపొర ఆలయంలో మహాశివరాత్రి రోజున శివుడికి వారు భక్తితో అభిషేకం చేసి, పండ్లు, స్వీట్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. అంతే కాకుండా వచ్చే ఏడాది మనందరం కలిసి శివరాత్రి ఉత్సవాలు జరుపుకుందామంటూ పండిట్లను ఆహ్వానిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మనమంతా కలిసుందాం, మేము కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ నినాదాలు చేశారు.

కశ్మీరీ పండిట్లు మా తనువు, మనసులోనూ భాగాలు...మా నుంచి వారిని ఎవరూ విడదీయలేరని స్థానిక ముస్లిం యువకుడు మన్సూర్ అహ్మద్ అన్నారు. వారి తిరిగి రావాల్సిందిగా సందేశం పంపుతున్నాం...దయచేసి రండి...మీతోనే మేము అంటూ ఆయన పేర్కొన్నాడు.

ఈ సంఘటన నిజంగా రెండు మతాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి అధిక కృషి చేస్తుందనడంలో సందేహం లేదు. మురికి పట్టిన రాజకీయాలు, మతతత్వం, ద్వేషంతో కూలిపోయిన సోదర బంధాన్ని తిరిగి పునరుద్దరించి శాంతి, సామరస్యంతో కలిసి జీవించడానికి, ప్రేమను పంచడానికి ఉపయోగపడుతుంది. కశ్మీరీ ముస్లింలు సేవకు ఆ మహాశివుడు కూడా చాలా సంతోషించి ఉంటాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.