యాప్నగరం

భక్తి శ్రద్ధల మధ్య బక్రీద్ పర్వదినం

తెలుగు రాష్ట్రాల ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

TNN 13 Sep 2016, 4:35 pm
తెలుగు రాష్ట్రాల ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. త్యాగానికి, నిస్వార్ధపూరితమైన దైవ భక్తికి ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని ఆచరిస్తారనే సంగతి తెలిసిందే. సృష్టికర్తయిన అల్లాహ్ అంటే అపారమైన భక్తీ, గౌరవంతో ఆయన చెప్పినట్లుగా తన కన్న కుమారుడినే బలిగా అర్పించేందుకు హజరత్ ఇబ్రహీం సిద్ధపడతారు. అప్పటి నుండి ఈ పండుగను ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదిలా ఉండగా హైదరాబాదులోని ప్రసిద్ధ మక్కా మసీదుతో పాటు
పలు కూడళ్లలో జరిగిన బక్రీద్ ప్రార్థనలకు వేలాదిగా ముస్లింలు హాజరయ్యారు. ఇటు ఇరు రాష్ట్రాల్లోని ముస్లింలకు ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, టి. సీఎం కేసీఆర్, అటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీలు కూడా శుభాకాంక్షలు తెలియచేశారు.
Samayam Telugu muslims in telugu states celebrate bakrid
భక్తి శ్రద్ధల మధ్య బక్రీద్ పర్వదినం


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.