యాప్నగరం

ఉజ్జయిని శివ లింగానికి నీటితోనే పూజలు!

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని శివలింగానికి ఇక మీదట శుద్ధి చేసిన నీటితో మాత్రమే పూజించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

TNN 27 Oct 2017, 6:38 pm
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని శివలింగానికి ఇక మీదట శుద్ధి చేసిన నీటితో మాత్రమే పూజించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లోని మహాకాళ్వేశర ఆలయంలోని శివలింగం అరుగుదలను పరీక్షించడం కోసం ఇక నుంచి రివర్స్ ఆస్మాసిస్ (ఆర్‌వో) చేసిన నీటితోనే పూజలు జరపాలని సూచించింది. పాలు, పెరుగు, చక్కెర లాంటి పదార్థాలతో శివలింగానికి అభిషేకం చేయొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం శుక్రవారం ఆలయ అధికారులకు నూతన నిబంధనలను జారీ చేసింది.
Samayam Telugu only ro water to be used for lord mahakal supreme court sets new worship norms
ఉజ్జయిని శివ లింగానికి నీటితోనే పూజలు!


శివలింగం అరుగుదల గురించి ఉజ్జయినీకి చెందిన సారిక గురు సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో అత్యున్నత ధర్మాసనం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాలను విచారణ కోసం పంపింది.

నూతన నిబంధనల ప్రకారం ఒక్కో భక్తుడు జలాభిషేకం కోసం అర లీటర్ ఆర్‌వో నీటిని మాత్రమే ఉపయోగించాలి. భస్మ హారతి సమయంలో శివలింగాన్ని పొడి వస్త్రంతో కప్పి ఉంచాలి, భక్తులు నిర్ణీత మోతాదులో మాత్రమే పాలు లేదా పంచామృతాన్ని సమర్పించాలి. తేమను తగ్గించడం కోసం గర్భ గుడిలో ఫ్యాన్లు, డ్రైయర్లను ఏర్పాటు చేయాలి. జ్యోతిర్లింగం పై భాగంలో మాత్రమే పుష్పాలను ఉంచాలి. రోజూ సాయంత్రం ఐదు గంటలకు గర్భగుడిని శుభ్రం చేయాలి. సాయంత్రం 5 గంటల తర్వాత పొడిగా ఉండే వాటితోనే శివలింగాన్ని పూజించాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.