యాప్నగరం

నేత్రపర్వంగా పంచారామాల కల్యాణోత్సవాలు

కార్తీక మాసాన్ని పురష్కరించుకుని భక్తి టీవీ అధ్వర్యంలో విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం కార్యక్రమం కన్నుల పండవగా జరుగుతోంది.

TNN 13 Nov 2017, 12:37 pm
కార్తీక మాసాన్ని పురష్కరించుకుని భక్తి టీవీ అధ్వర్యంలో విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం కార్యక్రమం కన్నుల పండవగా జరుగుతోంది. వందల సంఖ్యలో భక్తులు హాజరై కోటి దీపారాధన చేస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన దీపారాధాన.. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనంతో ప్రారంభమైంది. అనంతరం వేదికపై ఉజ్జయినీ మహాశివలింగానికి మహాభస్మాభిషేకం నిర్వహించారు. అలాగే భక్తులతో చౌకీలపై కోటిభస్మార్చన చేయించారు.
Samayam Telugu pancharama kshetras kalyanotsavam in koti deepothsavam
నేత్రపర్వంగా పంచారామాల కల్యాణోత్సవాలు


ఆ తరవాత వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పంచారామ క్షేత్రాల కల్యాణోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. పంచారామాల ఉత్సవమూర్తులను మైదానంలో ఊరేగించారు. శనివారం నాటి దీపారాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ పాల్గొన్నారు. అలాగే హరేకృష్ణ మూవ్‌మెంట్ అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ మధుపండితదాస, హరేకృష్ణ మూవ్‌మెంట్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు శ్రీ సత్య గౌరచంద్రదాస హాజరై దీపారాధన చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.