యాప్నగరం

దేశ వ్యాప్తంగా చైత్ర నవరాత్రి వేడుకలు

దేశ వ్యాప్తంగా ప్రజలు చైత్ర నవరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

TNN 8 Apr 2016, 7:13 pm
దేశ వ్యాప్తంగా హిందువులు చైత్ర నవరాత్రి (వసంత నవరాత్రి)ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసికి శుక్రవారం నాడు భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారణాసి నగరం మొత్తం వేద మంత్రోచ్చారణలతో మారుమోగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు గంగా హారతులతో నగరం అంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. గంగానది స్నానఘట్టాలన్నింటినీ దీపాలంకరణలతో ముంచెత్తేయడంతో నూతన శోభ సంతరించుకుంది. పుణ్యస్నానాలకు తరలి వచ్చిన వారంతా ప్రమిదలు, కొవ్వొత్తులు వెలిగించడంతో ఆ ప్రాంతం అంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. చైత్ర నవరాత్రి సందర్భంగా శక్తి స్వరూపిణిగా కొలిచే దుర్గాదేవి తొమ్మిది అవతారాలను నెలకొల్పి తొమ్మిదిరోజుల పాటు ఉపవాసముండి భక్తిగా కొలుస్తారు.
Samayam Telugu people across india celebrate chaitra navratri
దేశ వ్యాప్తంగా చైత్ర నవరాత్రి వేడుకలు


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.