మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం తీసుకుంటే ఉబ్బసంతో పాటు సర్వరోగాలు నయమవుతాయని ప్రజల్లో నమ్మకం ఉంది. ఆస్తమా, ఉబ్బసం వ్యాధిగ్రస్థులకు బత్తిని సోదరులు ఏటా మృగశిర కార్తె ప్రారంభం రోజున చేప ప్రసాదం పంపిణీ చేసే విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా బత్తిన సోదరుల ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ శనివారం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు మృగశిర కార్తె ప్రవేశించడంతో నాంపల్లి ఎగ్జిబిషన్గ్రౌండ్స్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, బత్తిని హరినాథ్గౌడ్ చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. ఇది ఆదివారం సాయంత్రం 6 గంటలవరకు కొనసాగుతుంది. కాగా, చేప ప్రసాదం కోసం ఏపీ, తెలంగాణలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారు భారీగా తరలివచ్చారు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ జన సంద్రంగా మారింది. మరోవైపు, చేప ప్రసాద పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పోలీసులు, అగ్నిమాపకశాఖ, జీహెచ్ఎంసీ, సమాచార పౌరసంబంధాలశాఖ, జలమండలి, ఆర్అండ్బీ, విద్యు త్తు, ఆర్టీసీ, వైద్యారోగ్యశాఖ అధికారులు సమిష్టిగా పనిచేసి అన్ని వసతులు కల్పించారు. తెలంగాణ అగర్వాల్ సమాజ్, బద్రీ విశాల్ పన్నాలాల్ ట్రస్ట్, అగర్వాల్ సేవాదళ్, హైదరాబాద్ జైస్వాల్ సేవా సమితి, ఉత్తర భారతీయ నాగరిక్ మంచ్ సంస్థలు చేప ప్రసాదం కోసం వచ్చినవారికి అల్పాహారం, భోజనాలు, మంచినీళ్లు, మజ్జిగ సరఫరా చేస్తున్నారు. కేవలం మూడు గంటల్లోనూ 30 వేల మందికి చేప ప్రసాదం పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. అన్ని శాఖలను సమన్వయం చేయడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి, దీనిని 60 సీసీటీవీ కెమెరాలతో అనుసంధానం చేశారు.
ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే చేప ప్రసాదం కోసం లక్షల మంది అస్తమా రోగులు బారులు తీరారు. మొత్తం 32 కౌంటర్లు, ఒక స్పెషల్ కౌంటర్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చారు. దాదాపు 175 ఏళ్లుగా బత్తిని కుటుంబసభ్యులు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈఏడాది ఉబ్బసం రోగుల కోసం 1.4 లక్షల కొరమీను చేప పిల్లలు, 4.5 లక్షల నీటి ప్యాకెట్లు, రూ.5 భోజనాలను ప్రభుత్వం అందజేస్తోంది.
చేప ప్రసాదం తీసుకున్న వారు 45 రోజులు పత్యం ఉండాలని బత్తిన సోదరులు పేర్కొన్నారు. చేపప్రసాదాన్ని కనీసం నాలుగు పర్యాయాలు తీసుకుంటే పిత్తం, వాతం, కఫం, దగ్గు, ఆయాసం, జలుబు, తుమ్ములు తగ్గుతాయని బత్తిన హరినాథ్ గౌడ్ తెలిపారు. రెండు రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ ముగిసిన తర్వాత ఇంటి వద్ద ఉబ్బస వ్యాధిగ్రస్తులు చేపలను తీసుకుని వస్తే వారికి ‘కార్తె’ ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.
ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే చేప ప్రసాదం కోసం లక్షల మంది అస్తమా రోగులు బారులు తీరారు. మొత్తం 32 కౌంటర్లు, ఒక స్పెషల్ కౌంటర్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చారు. దాదాపు 175 ఏళ్లుగా బత్తిని కుటుంబసభ్యులు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈఏడాది ఉబ్బసం రోగుల కోసం 1.4 లక్షల కొరమీను చేప పిల్లలు, 4.5 లక్షల నీటి ప్యాకెట్లు, రూ.5 భోజనాలను ప్రభుత్వం అందజేస్తోంది.
చేప ప్రసాదం తీసుకున్న వారు 45 రోజులు పత్యం ఉండాలని బత్తిన సోదరులు పేర్కొన్నారు. చేపప్రసాదాన్ని కనీసం నాలుగు పర్యాయాలు తీసుకుంటే పిత్తం, వాతం, కఫం, దగ్గు, ఆయాసం, జలుబు, తుమ్ములు తగ్గుతాయని బత్తిన హరినాథ్ గౌడ్ తెలిపారు. రెండు రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ ముగిసిన తర్వాత ఇంటి వద్ద ఉబ్బస వ్యాధిగ్రస్తులు చేపలను తీసుకుని వస్తే వారికి ‘కార్తె’ ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.