యాప్నగరం

నిలువెత్తు కలువలతో మోదీ తులాభారం!

రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ కేరళలో శనివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గురవాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Samayam Telugu 8 Jun 2019, 1:58 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళలో శనివారం పర్యటిస్తున్నారు. శుక్రవారం రాత్రి కోచికి చేరుకున్న మోదీ.. శనివారం ఉదయం అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో త్రిశూర్‌ చేరుకున్నారు. గురువాయూర్‌ చేరుకున్న ప్రధాని అక్కడ ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. మోదీకి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో మోదీ తులాభార కార్యక్రమం జరిగింది. మొత్తం 100 కిలోల కలువలతో మోదీకి తులాభారం వేశారు. తన బరువుకు తూగే కలువలను స్వామివారికి ప్రధాని మోదీ సమర్పించారు. గురవాయూర్ ఆలయంలో తులాభారంలో పుష్పాలు, పండ్లు, ధాన్యాలు తదితరలాను సమర్పిస్తారు. వీటికి సమానమైన విలువతో డబ్బులను ఆలయానికి అందజేస్తారు. ఆలయంలో ప్రధాని మోదీ 20 నిమిషాలు పాటు గడిపారు. కేరళ సంప్రదాయ దుస్తుల్లోనే ఆలయంలోకి మోదీ ప్రవేశించారు. ప్రధాని వెంట కేరళ గవర్నర్ సదాశివన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్, కేరళ దేవాదాయ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ఉన్నారు.
Samayam Telugu modi.


శ్రీకృష్ణాలయంలో ప్రత్యేక పూజల అనంతరం బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన అభినందన సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ పాల్గొన్న తొలి పబ్లిక్ మీటింగ్ ఇదే. తర్వాత కేరళ నుంచి మాల్దీవులు, శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే. మాల్దీవులు పర్యటనలో భాగంగా అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహిం సొహిల్‌తో భేటీ అయి కొన్ని ఒప్పందాలు చేసుకోనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో శుక్రవారం నుంచి గురువాయూర్ ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.