యాప్నగరం

ఈ పవర్‌ఫుల్ మంత్రాలతో పరీక్షల్లో విజయం ఖాయం!

మంత్రాలు కేవలం శబ్దాలే కాదు.. మంత్ర పఠనంతో శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. వీటి వల్ల తెలియని అనుభూతి కలుగుతుంది.

TNN 10 Feb 2018, 4:11 pm
మంత్రాలు కేవలం శబ్దాలే కాదు.. మంత్ర పఠనంతో శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. వీటి వల్ల తెలియని అనుభూతి కలుగుతుంది. మనలో ఉండే శక్తిని మేల్కొలిపి, ఫలితాల సాధనపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు కొన్ని మంత్రాలను ఉచ్చరించడం వల్ల ఏకాగ్రత కలుగుతుంది. దీంతో సునాయాసంగా విజయం సాధిస్తారు.
Samayam Telugu powerful mantras for success in exams
ఈ పవర్‌ఫుల్ మంత్రాలతో పరీక్షల్లో విజయం ఖాయం!


‘ఓం ఐం వాగ్దేవాయై విద్మహే.. కమరాజ్యాయ దీమహే.. తన్నో దేవి ప్రచోదయాత్’ఇది సరస్వతి గాయత్రి మంత్రం... చాలా శక్తివంతమైంది. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైంది. ఙ్ఞానాభివృద్ధికి, విద్యకు సహాయకారిగా ఉంటుంది. చదువు పట్ల ఏకాగ్రత సాధించడానికి ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే ఫలితం ఉంటుంది.

‘శ్రీం హ్రీం సర్వస్వత్యాయ స్వాహ.. ఐం హ్రీం, ఐంగ్ హ్రీం సరస్వత్యాయ నమ:’ అనే సరస్వతి మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపిస్తే తెలివితేటలు వృద్ధి చెందుతాయి. ఉన్నత విద్యలో చేరాలనుకునేవారికి ఇది చాలా సహాయపడుతుంది.

చిన్న పిల్లలు సరస్వతి బీజ మంత్రాన్ని ఉచ్చరించాలి. ‘ఐంగ్ ఓం ఐంగ్ నమ:, ఐం ఐంగ్ క్లీం సౌహ’ ఈ మంత్రాలను చిన్న పిల్లలు ఉచ్చరించడానికి అనుకూలంగా ఉంటాయి.

‘గురు గృహ‌ గయ పధాన రఘురాయే, అల్పకాల విద్యా సబపాయే’ రామచరిత మానస్ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే ఉన్నత విద్యావంతులకు ఉపయోగం ఉంటుంది.

‘జహీ పర్ కృపా కరిన్ జాను జాని కబీ ఉర్ అజీర్ నచవ్విన్ బని... మోరి సుధాహరి సొసాబ్ భాంతి జాసు కృపా నహిన్ కృపన్ అఘాతి’ఈ మంత్రం పఠిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.

‘ఓం షౌమ్ షౌక్ వనాశిభియం నమః’ ఈ మంత్రాన్ని రోజూ చదివే ముందు, పరీక్ష రాసే ముందు 11 సార్లు ఉచ్చరించాలి.

‘ఓం గం గణపతియే నమ:’మంత్రాన్ని పఠిస్తే మేధస్సు, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షల్లో విజయం సాధిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.