యాప్నగరం

పూరి జగన్నాథ రథయాత్ర.. శతాబ్దాల చరిత

దేశంలోని శ్రీ క్షేత్రాల్లో పూరిలో జగన్నాథ ఆలయం ముఖ్యమైంది. ఇక్కడ శ్రీమహావిష్ణువు జగన్నాథునిగా పూజలందుకుంటున్నారు. సోదరి సుభద్ర, సోదరుడు బలభద్ర సమేత జగన్నాథుడు కొలువుదీరిన శ్రీక్షేత్రం.

Samayam Telugu 5 Dec 2022, 6:31 pm
దేశంలోని శ్రీ క్షేత్రాల్లో పూరిలో జగన్నాథ ఆలయం ముఖ్యమైంది. ఇక్కడ శ్రీమహావిష్ణువు జగన్నాథునిగా పూజలందుకుంటున్నారు. సోదరి సుభద్ర, సోదరుడు బలభద్ర సమేత జగన్నాథుడు కొలువుదీరిన శ్రీక్షేత్రం. ఇక్కడ నిర్వహించే రథయాత్రకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ యాత్రకు విదేశీయులు సైతం పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం. శతాబ్దాలుగా జగన్నాథ రథయాత్ర జరుగుతోంది. బాల్యం శ్రీకృష్ణుడు లీలలకు నెలవైన బృందావనానికి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలను ఉత్సవంగా తీసుకు వెళ్ళడమే రథయాత్ర మహోత్సవం.
Samayam Telugu Puri Temple


బలరామకృష్ణులు ద్వారకలో ఉన్నప్పుడు ఒకసారి అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. ఆ సమయంలో కురుక్షేత్రంలోని సమంత-పంచకం అనే పుణ్యస్థలంలో అందరూ చేరారు.యాదవులందరూ పవిత్రమైన నదిలో స్నానం చేసి, గ్రహణ సమయం పూర్తయ్యేవరకూ ఉపవాస దీక్షను ఆచరించారు. గ్రహణం సమయంలో ఎంత వీలైతే అంత ఎక్కువగా దాన ధర్మాలు చేయాలని వైదిక ఆచారాలు నిర్దేశించాయి. ఆ ప్రకారం యాదవులు కొన్ని వందల గోవులను దానం చేశారు. ఆ గోవులను కూడా చక్కని వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించారు. ప్రత్యేకించి వాటి కాళ్ళకు బంగారు గంటలు, మెడలో పూల దండలు వేశారు.

ఇదే సమయంలో బృందావన వాసులు కూడా ఆ పవిత్ర స్థలానికి వెళ్లారు. చాలా కాలం తర్వాత బలరామకృష్ణులను కలుసుకోవడంతో సంతోషంగా ఉన్నారు. ఉద్వేగంతో వారి గుండె చప్పుడు అధికమై, అప్పుడే వికసించిన తామరలా ముఖాలు ప్రకాశిస్తూ కళ్ల నుంచి ఆనందాశ్రువులు స్రవించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళందరూ ఆనంద సాగరంలో మునిగి పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.