యాప్నగరం

కమనీయం రుక్మిణీ కల్యాణం

పవిత్ర కార్తీక మాసాన్ని పురష్కరించుకుని భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం నేత్రపర్వంగా కొనసాగుతోంది.

TNN 2 Nov 2017, 12:55 pm
పవిత్ర కార్తీక మాసాన్ని పురష్కరించుకుని భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం నేత్రపర్వంగా కొనసాగుతోంది. బుధవారం కార్తీక శుద్ధ ద్వాదశి కావడంతో కోటి దీపోత్సవానికి భక్తులు అశేషంగా తరలివచ్చారు. భక్తుల శివనామ స్మరణతో ఎన్టీఆర్ స్టేడియం మార్మోగింది. బుధవారం సాయంత్రం ధూళిపాళ్ల మహదేవమణి ప్రవచనంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం శ్రీకృష్ణ దామోదర అభిషేకం, భక్తులతో కోటి తులసీదళార్చన నిర్వహించారు.
Samayam Telugu rukmini kalyanam performed at koti deepothsavam in hyderabad
కమనీయం రుక్మిణీ కల్యాణం


ఆ తరవాత వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రుక్మిణీ కల్యాణం కమనీయంగా జరిగింది. అనంతరం తులసీ దామోదర కల్యాణం నేత్రపర్వంగా జరిపారు. అలాగే రుక్మిణీ కృష్ణులకు, తులసీ దామోదరులకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. బుధవారం నాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఆయనతో పాటు హరేకృష్ణ సారథి, అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ మధుపండిత దాస, ముంబై హరేకృష్ణ అధ్యక్షులు శ్రీ అమితాసన దాస, అహ్మదాబాద్ హరేకృష్ణ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ దాస, ఆంద్రప్రదేశ్, తెలంగాణ హరేకృష్ణ అధ్యక్షులు శ్రీ సత్యగౌరచంద్రదాస పాల్గొని పూజలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.