యాప్నగరం

సకాలంలో వర్షాలు: రంగంలో చెప్పిన స్వర్ణలత

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం వైభవంగా జరిగింది. బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రంగం కార్యక్రమానికి విశేష ప్రాముఖ్యత ఉంది.

TNN 10 Jul 2017, 11:30 am
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం వైభవంగా జరిగింది. బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రంగం కార్యక్రమానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ఘట్టాన్ని చూడటానికి భక్తులు ఉత్సహాంగా వస్తారు. ఈ రోజు ఉదయం పచ్చి కుండపై నిలబడిన స్వర్ణలత అమ్మవారిని తనలోకి ఆవాహనం చేసుకుని భవిష్యవాణిని వినిపించింది. తాను సంతోషంగానే ఉన్నానని, తనకు జరుగుతున్న పూజలు ఆనందాన్ని కలిగిస్తున్నాయని అమ్మ పలికింది. ప్రజలందరూ సుఖశాంతులతో వర్థిల్లేలా చూస్తానని, ఎటువంటి ఆపదా రానివ్వనని వరమిచ్చారు. రాబోయే రోజుల్లో వర్షాలు పుష్కలంగా కురిసి, పంటలు బాగా పండుతాయని సెలవిచ్చింది. తనను బాగా చూసుకునే పాలకులపై తన కరుణ ఎల్లప్పుడూ ఉంటుందని, వారిని కాపాడుతూ ఉంటానని అన్నారు.
Samayam Telugu secunderabad mahankali temple bonalu celebrations
సకాలంలో వర్షాలు: రంగంలో చెప్పిన స్వర్ణలత



ఒకరిని తక్కువగా, ఒకరిని ఎక్కువగా చూడనని, తక్కువ సేవ చేసినా, ఎక్కువ సేవ చేసినా, అందరూ తన బిడ్డలేనని స్వర్ణలతను ఆవహించిన అమ్మవారు పలికారు. తనకు జరిగే పూజల్లో కొంత లోటు కనిపిస్తోందని, అది మాత్రం అసంతృప్తిగా ఉందని చెప్పింది. లష్కర్ బోనాల రంగం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భవిష్య వాణి వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అమ్మవారిని ఆలయ పురవీధుల్లో అంబారిపై ఊరేగించి, సాగనంపు కార్యక్రమం నిర్వహిస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చే వారం పాతబస్తీ లాల్‌దర్వాజ్ అమ్మవారి బోనాలు జరగనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.