యాప్నగరం

దుర్గ గుడిలో అపచారం.. అమ్మవారి తాళిబొట్టు తాకట్టు!

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి ఆలయం ప్రాంగణంలోని సుబ్రహ్మణ్వేశ్వర స్వామి దేవేరి శ్రీవల్లీ దేవి మంగళ సూత్రం తాకట్టు.

TNN 29 Oct 2017, 12:55 pm
కనకదుర్గమ్మ కొలువున్న బెజవాడ ఇంద్రకీలాద్రిపై అపచారం జరిగింది. దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉపాలయంలోని ఆయన దేవేరి శ్రీవల్లీ అమ్మవారి మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టారన్న విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఓ అర్చకుడు ఈ పని చేశాడని భావిస్తుండగా, అధికారులు ఆఘమేఘాల మీద తాకట్టుపెట్టిన ఆ మంగళసూత్రాన్ని విడిపించి తెచ్చి, తిరిగి అమ్మవారికి అలంకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో వివరణ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. అంతర్గతంగా విచారణ జరుగుతోందని, ఎవరు తప్పు చేసినా శిక్ష ఉంటుందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి పేర్కొన్నారు. కాగా, కొందరు అధికారుల ప్రోద్బలంతోనే కొండపై ఇలాంటివి జరుగుతున్నాయని, ఇంకా దేవీ, స్వామివార్లకు చెందిన ఎన్ని ఆభరణాలు ఇలా బయటకు వెళ్లాయో లెక్క తేల్చాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Samayam Telugu shocking incident at vijayawada kanaka durga temple
దుర్గ గుడిలో అపచారం.. అమ్మవారి తాళిబొట్టు తాకట్టు!


ఆలయ అధికారులు అలసత్వం వహించడమే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అత్యంత పవిత్రంగా భావించే అమ్మవారి ఆలయంలో భయం లేకుండా అనాచారాలకు, అపవిత్ర కార్యాలకు పాల్పడుతున్నారు. దేవుడికి సమర్పించిన నైవేథ్యాన్ని కూడా చెత్త కుండీల్లో పడేసిన ఘటనలు కూడా ఆలయంలో చోటుచేసుకున్నాయి. ఆలయంలోని అర్చకుల అక్రమాలను ప్రశ్నించినందుకు 2016 మేలో ఈఓ తమను వేధిస్తున్నారని ఆయనపై ఫిర్యాదులు చేయడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.