యాప్నగరం

శ్రావణ మాసం: శివసహస్ర నామాలతో సమస్యలు దూరం

శివుడి వేయి పేర్లను శివ సహస్రనామాలతో పిలుస్తారు. హిందూ మతంలో వీటికి విశేష ప్రాధాన్యత ఉంది. శివ మహాపురాణంలో సహస్రనామాల గురించి వివరించారు.

Samayam Telugu 5 Dec 2022, 3:22 pm
శివుడి వేయి పేర్లను శివ సహస్రనామాలతో పిలుస్తారు. హిందూ మతంలో వీటికి విశేష ప్రాధాన్యత ఉంది. శివ మహాపురాణంలో సహస్రనామాల గురించి వివరించారు. శివపురాణాన్నే లింగ పురాణం అని కూడా పిలుస్తారు. శివ మహపురాణం ప్రకారం.. రాక్షసులతో యుద్ధం చేస్తోన్న మహావిష్ణువు వారిని సంహరించడంలో విఫలమైనప్పుడు మహాదేవుని ప్రార్థించడంతో ఆయన సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. దీని సాయంతో దానవులను ఓడించాడు.
Samayam Telugu lord shiva


సరైన విధానంలో శివ సహస్ర నామాలను జపిస్తే జీవితంలో శాంతి, సంతోషం, సానుకూలత, కృతజ్ఞత, మానసిక సంకల్పం బలంగా ఉంటాయి. వీటిని రోజుకు మూడుసార్లు పఠిస్తే ఇంటిలోని అన్ని సమస్యలు నెల రోజుల్లో సమసిపోతాయి. అయితే దీనికి ముందు సంకల్పం తప్పనిసరి. బ్రహ్మ ముహూర్తంలో మూడు నుంచి ఐదుసార్లు ఉచ్చరిస్తే ఊహించని ఫలితం ఉంటుంది.

శివ' అనే శబ్దము చాలా గొప్పది. శివమహాపురాణం శివ శబ్దంతోనే ప్రారంభమైంది. శివ శబ్దాన్ని అమరకోశం వ్యాఖ్యానించింది. అమరకోశం సాధికారిక గ్రంథం. దీనిని అమరసింహుడు అనే జైన కవి రచించాడు. ఆయన అమర కోశంతోపాటు అనేక గ్రంథాలను రాసినా, శంకర భగవత్పాదులతో వాదానికి దిగినప్పుడు ఆయన చేతిలో ఓడిపోయాడు. దీంతో కలతచెందిన అమరసింహుడు.. తాను శంకరాచార్యుల చేతిలో ఓడిపోయాను కాబట్టి రచించిన గ్రంథాలన్నీ పనికిమాలినవి అయిపోయాయి' అని భావించి వాటిని ఆగ్నిలో వేశాడు. ఈ విషయం తెలిసిన శంకరులు అక్కడకు వచ్చి ఎంత పని చేశారయ్యా! గ్రంథాలను ఎందుకు తగులబెట్టావు?' అని అడిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.