యాప్నగరం

మాఘ పౌర్ణమినాడు సింధూస్నానం చేస్తే...

పవిత్ర సంగమం వద్ద మాఘ శుద్ధ పౌర్ణమి నాడు సింధూ స్నానాలు ఆచరిస్తే సర్వపాపాలు హరించుకుపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

TNN 5 Dec 2022, 4:31 pm
పవిత్ర సంగమం వద్ద మాఘ శుద్ధ పౌర్ణమి నాడు సింధూ స్నానాలు ఆచరిస్తే సర్వపాపాలు హరించుకుపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాఘస్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్షుతోపాటు మంచితనం, ఉత్తమశీలం లభిస్తాయని పద్మ పురాణంలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రభావాలకు ముఖ్య కారణం సూర్యుడు మకర రాసిలో ప్రవేశించడమే. ఈ సమయంలో శివకేశవులు ఇరువురినీ పూజించాలనీ, దాన ధర్మాలు చేయాలనీ సాధ్యమైనంత వరకు దైవచింతనతో గడపాలని, ఈ మాసమంతా నదీ స్నానం చేయలేకపోయినా కనీసం మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశి మొదలైన రోజులలో అయినా చేయాలి. ఎందుకంటే అన్ని జలాల్లోనూ గంగ ప్రవేశించి ఉంటుందన్న నమ్ముతారు.
Samayam Telugu Moon


ముఖ్యంగా ఈ రోజున కృష్ణానది సముద్రంలో కలిసేచోట హంసలదీవిలో సింధూ స్నానాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఏటా ఆ రోజున రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీంతో హంసలదీవిలోని సాగర తీరమంతా భక్తజనసంద్రంగా మారుతుంది. ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనున్నారు. దీని కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు.

అయితే బుధవారం రాత్రికే రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీంతో చంద్రగ్రహణం రోజున పౌర్ణమి స్నానాలు చేయొచ్చా..లేదా అనే సందేహాలు భక్తుల్లో నెలకొన్నాయి. చంద్రగ్రహణం కారణంగా జనవరి 31న పగలు 11 గంటల వరకు మాత్రమే హంసలదీవిలో శ్రీవేణుగోపాలస్వామి ఆలయం తెరచి ఉంటుందని అధికారులు ప్రకటించడంతో భక్తుల్లో మరికొంత గందరగోళం నెలకొంది. సాయంత్రం వరకు స్నానాలు ఆచరిస్తూ రోజంతా స్వామిని దర్శించుకునేవారు. ఈఏడాది చంద్రగ్రహణం రావడంతో ఆరోజు స్నానాలు ఆచరించవచ్చా అనే మీమాంస భక్తుల్లో వ్యక్తమవుతోంది. మధ్యాహ్నం 12 గంటలలోపు సముద్ర స్నానాలు చేయడం ఉత్తమమని పండితులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.