యాప్నగరం

వరాహ లక్ష్మీనృసింహస్వామికి చందనపూజ

కార్తీక మాసాన్ని పురష్కరించుకుని భక్తి టీవీ ఆధ్వర్యంలో విజయవాడలో తొలిసారి నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం కన్నుల పండువగా సాగుతోంది.

TNN 10 Nov 2017, 12:07 pm
కార్తీక మాసాన్ని పురష్కరించుకుని భక్తి టీవీ ఆధ్వర్యంలో విజయవాడలో తొలిసారి నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. నగరంలోని పిడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన దీపారాధన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై షిర్డీ సాయిబాబా పాదుకలకు, సాయి నాణేలకు సంధ్యా హారతి నిర్వహించారు. అనంతరం వేదికపై పాదుకా పూజ జరిపారు. చౌకీలపై భక్తులతో సాయిపాదుకా పూజ చేయించారు.
Samayam Telugu simhachalam lakshmi narasimha swamy chandana puja performed at koti deepothsavam in vijayawada
వరాహ లక్ష్మీనృసింహస్వామికి చందనపూజ


ఆ తరవాత సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామికి చందనపూజను వైభవంగా నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సింహద్రి అప్పన్న కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకరభారతీ స్వామి, పెదపులిపాక శ్రీ రాజరాజేశ్వర పీఠం పీఠాధిపతి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి, చైతన్య తపోవనం మాతా శివచైతన్య పాల్గొన్నారు. వీరంతా భక్తులతో పాటు సామూహిక దీపారాధన చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.