యాప్నగరం

బంగారు రామయ్యకు నేడే కల్యాణం

శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని హిందువులు పండుగగా జరుపుకుంటారు. శ్రీరామ కల్యాణం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగింది.

TNN 14 Apr 2016, 1:49 pm
శ్రీ రాముడు, త్రేతా యుగం లో వసంత ఋతువు, చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో జన్మించాడని ఆదికవి వాల్మీకి వర్ణించాడు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని హిందువులు పండుగగా జరుపుకుంటారు. శ్రీరామ కల్యాణం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగింది.పద్నాలుగేళ్ళ వనవాసం , తర్వాత రావణ సంహారం జరిగాక శ్రీ రామ పట్టాభిషేకం కూడా ఇదే తిధి నాడు జరిగిందని హిందువులు విశ్వసిస్తారు.'సుపరిపాలనకు ప్రతీక' అంటే 'రామ రాజ్యమే'అనే విధంగా రాజ్యం చేసాడు. అందుకే దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో,సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువులు భావిస్తారు.శ్రీ రామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు.బెల్లం, మిరియాలు, మంచి నీళ్ళు కలిపి తయారు చేసే పానకం , నానబెట్టిన పెసర పప్పు తో తయారు చేసే వడ పప్పు, శ్రీ రామనవమి నాటి ముఖ్య నైవేద్యాలు.
Samayam Telugu sri rama navami
బంగారు రామయ్యకు నేడే కల్యాణం


రామ భక్తులకు భద్రాచలం ఎంతో ప్రాముఖ్యత గల ప్రదేశం. వనవాస సమయంలో రాముడు భద్రాచలం దగ్గరున్న పర్ణశాలలో నివశించాడనీ , సీతాపహరణం తర్వాత ఆమెను వెదికే క్రమంలో శబరిని భద్రాచలం దగ్గరే కలుసుకున్నాడనీ భక్తుల విశ్వాసం భద్రాచలం లో భక్త రామదాసుచే నిర్మించబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి ఉత్సవం అత్యంత వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి , సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను, తన తలపై పెట్టుకుని తీసుకువచ్చి స్వామికి అర్పించడం నేటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే !

సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే !!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.