యాప్నగరం

వైభవంగా సాగుతోన్న శోభాయాత్ర.. పటిష్ట భద్రత

శ్రీరామనవమి సందర్భంగా సీతారామ్‌ బాగ్‌, రాణి అవంతీబాయ్‌ ఆలయం నుంచి ప్రారంభమైన శ్రీరామ శోభయాత్ర గౌలిగూడలోని హనుమాన్ వ్యాయశాల వరకూ సాగనుంది.

Samayam Telugu 25 Mar 2018, 1:05 pm
శ్రీరామనవమి సందర్భంగా సీతారామ్‌ బాగ్‌, రాణి అవంతీబాయ్‌ ఆలయం నుంచి ప్రారంభమైన శ్రీరామ శోభయాత్ర గౌలిగూడలోని హనుమాన్ వ్యాయశాల వరకూ సాగనుంది. శోభాయాత్రలో శ్రీరామ ఉత్సవ సమితి, భజరంగ్‌దళ్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ యాత్రకు హైదరాబాద్ పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పురాన్‌పూల్, గౌలీగూడ, సుల్తాన్ బజార్ మీదుగా సాగే ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను వినియోగిస్తున్నారు. ఇందు కోసం అదనంగా ఐదువేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ మద్యం దుకాణాలను సైతం మూసివేయించారు. శోభాయాత్రలో సుమారు లక్షన్నర మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
Samayam Telugu శ్రీరామ శోభాయాత్ర


పాతబస్తీలో శోభాయాత్ర నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ప్రముఖ ఆలయాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్‌రూంలను ఏర్పాటును చేశారు. అదనపు కమిషనర్‌ షిఖాగోయల్‌ ఆధ్వర్యంలో అదనపు డీసీపీలు-3, డీఎస్పీలు-4, ఇన్‌స్పెక్టర్లు-28, ఎస్సైలు-38, హెడ్‌కానిస్టేబుళ్లు-46, కానిస్టేబుళ్లు-86, అదనపు బలగాలు ప్లాటూన్‌-13, టీయర్‌గ్యాస్‌ స్క్వాడ్స్‌-2 బందోబస్తులో విధులు నిర్వహిస్తున్నారు. యాత్ర జరిగే ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.