యాప్నగరం

అదిగో కిష్కింధ... ఇదిగో సీతమ్మ జన్మస్థలం

సీతమ్మ భూమి నుంచి ఉద్భవించింది. అందుకే అయోనిజ అయ్యింది.

TNN 5 Apr 2017, 2:47 pm
సీతమ్మ భూమి నుంచి ఉద్భవించింది. అందుకే అయోనిజ అయ్యింది. సాధారణంగా తల్లి గర్భంలో ఎదిగి... ప్రసవించలేదు కనుక... ఆమెకు అయోనిజ అని పేరు వచ్చింది. అందరికీ తెలుసు సీత తల్లి భూమాత. జనకుడికి భూమిలోనే దొరికింది సీతమ్మ. మరి ఆ ప్రాంతం ఎక్కడుంది? ఇప్పుడు ఎలా ఉంది?... బీహార్ లోని సీతామర్హి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోనే సీతమ్మ వారు జనకమహారాజుకు దొరికిందని ప్రజలు చెప్పుకుంటారు. జనక్ పూర్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలోనే త్రేతాయుగంలో మిథిలా రాజ్యం ఉండేది. అక్కడ నదీ తీరంలో జనక మహారాజు భూమిని దున్నుతుండగా బంగారు పేటిక లభించింది. అందులో సీతమ్మ వారు శిశువుగా జనకునికి లభించింది. భూమాత ఇచ్చిన వరంలా ఆమెను పెంచుకున్నారు జనకుని దంపతులు. సీతామర్హికి అయిదు కిలోమీటర్ల ఉన్న పుణ్యారణ్యంలో కూడా సీతారాములు తిరిగారని భక్తులు నమ్మకం.
Samayam Telugu sriramanavami special where is kishkindha and birth place of seethamma
అదిగో కిష్కింధ... ఇదిగో సీతమ్మ జన్మస్థలం


కిష్కింధ ప్రాంతంలో... ఆంజనేయ పర్వతం

సీతారాములను గుండెల్లో పెట్టుకున్న పరమ భక్తుడు హనుమంతుడు. అతడు నివసించిన కిష్కింధకు కూడా రామాయణంలో చాలా ప్రముఖ స్థానం ఉంది. ఈ కిష్కింధ ఎక్కడో కాదు కర్ణాటకకు దగ్గర్లోనే ఉండేదని ప్రతీతి. పుణ్యక్షేత్రమైన హంపి చుట్టుపక్కలే త్రేతాయుగంలో కిష్కింధ రాజ్యం ఉండేదని చెబుతారు. ఇక్కడే రాముడు శబరిని కలుసుకున్నాడని కూడా భక్తులు నమ్మకం. రాముడు చాటుగా ఉండి వాలిని చంపి, సుగ్రీవుడిని పట్టాభిషిక్తుడిని చేసింది కూడా ఇక్కడేనని స్థానికుల నమ్మకం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.