యాప్నగరం

వైభవంగా శ్రీశైల మల్లికార్జునుడి కల్యాణం

పవిత్ర కార్తీక మాసాన్ని పురష్కరించుకొని భక్తి టీవీ ఆధ్వర్యంలో విజయవాడలోని పీడబ్ల్యూ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం కార్యక్రమం నేత్ర పర్వంగా సాగుతోంది.

TNN 14 Nov 2017, 12:10 pm
పవిత్ర కార్తీక మాసాన్ని పురష్కరించుకొని భక్తి టీవీ ఆధ్వర్యంలో విజయవాడలోని పీడబ్ల్యూ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం కార్యక్రమం నేత్ర పర్వంగా సాగుతోంది. రోజుకో ఆధ్యాత్మిక కార్యక్రమంతో దీపారాధనకు విచ్చేస్తున్న భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. సోమవారం సాయంత్రం కూడా అశేషంగా హాజరైన భక్తజనం దైవ చింతనలో గడిపారు. తొలుత బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తరవాత వేదికపై రుద్రాక్ష శివలింగానికి కోటి రుద్రాక్షల అర్చన జరిపారు. విచ్చేసిన భక్తజనంతో చౌకీలపై శివలింగానికి కోటి రుద్రాక్షల అర్చన చేయించారు.
Samayam Telugu srisailam mallikarjuna swamy kalyanam at koti deepothsavam
వైభవంగా శ్రీశైల మల్లికార్జునుడి కల్యాణం


అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబ దేవీల కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా జరిపారు. శ్రీశైల ఉత్సవమూర్తులను నందివాహనంపై ఊరేగించారు. సోమవారం నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాణిక్యాలరావు, కిమిడి కలావెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావు, జాయింట్ పోలీస్ కమిషనర్ రమణకుమార్ విచ్చేశారు. అతిథులతో పాటు భక్తులు సామూహిక కార్తీక దీపారాధన చేశారు. దీంతో విజయవాడలో కోటి దీపోత్సవం ఘనంగా ముగిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.