యాప్నగరం

గజవాహనంపై గోవిందుడు.. వైభవంగా స్వర్ణరథోత్సవం

రాజులను పట్టాభిషేకాది సమయాలలో ఏనుగులపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. శ్రీవారు గజవాహనారూఢుడై తిరువీధులలో సంచరించడం భక్తులకు మరపురాని దృశ్యం.

Samayam Telugu 19 Sep 2018, 4:13 pm
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి మలయప్పస్వామి గజ వాహనంపై తిరువీధుల్లో ఊరేగారు. చతురంగ బలాల్లో గజ రాజులది విశిష్టమైన స్థానం. గజేంద్ర మోక్షంలో మొసలి నోట చిక్కుకున్న గజేంద్రుని రక్షించేందుకు వైకుంఠం నుంచి శ్రీహరి విచ్చేశాడు. ‘సిరికిం జెప్పడు..’ అంటూ ఆపదలో ఉన్న భక్తుడిని ఆదుకునేందుకు శ్రీమన్నారాయణుడు ఒక్క ఉదుటున భూలోకానికి చేరుకున్నాడు. భక్తులు ఆపదలో ఉంటే స్వామివారు ఏ మాత్రం ఉపక్షించరని దీని అర్థం. అందుకే వైకుంఠనాధుడిని భక్తపరాయణుడని అంటారు.
Samayam Telugu శ్రీవారి గజవాహన సేవ


గజరాజుపై ఉన్న స్వామిని చూస్తే శ్రీలక్ష్మీ కటాక్షం కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. రాజులను పట్టాభిషేకాది సమయాలలో ఏనుగులపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. శ్రీవారు గజవాహనారూఢుడై తిరువీధులలో సంచరించడం భక్తులకు మరపురాని దృశ్యం. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ప్రతిరోజూ బ్రహ్మోత్సవాలలో వాహనసేవ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.

బ్రహ్మరథం వెనుక అశ్వాలు, వృషభాలతో ఠీవిగా ఈ గజాలు కూడా నడిచివస్తాయి. అంతకు ముందు స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉభయదేవేరులతో మలయప్పస్వామి స్వర్ణరథంపై ఆసీనులై నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.