యాప్నగరం

శ్రీవారి గరుడసేవ.. భక్తజన సంద్రమైన తిరుమల

సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైన గరుడవాహనంపై ఉన్న స్వామిని దర్శిస్తే, స్వర్గం ప్రాప్తించి, ఇహపరమైన ఈతిబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Samayam Telugu 18 Sep 2018, 4:08 pm
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు నిర్వహించే గరుడవాహన సేవకు తరలివచ్చిన భక్తులతో కలియుగ వైకుంఠం భక్తజన సంద్రమైంది. లక్షలాది భక్తులతో అనంత భక్త సాగరాన్ని తలపించిన తిరుమల గోవింద నామస్మరణతో మార్మోగింది. సోమవారం రాత్రి దేవదేవుడు తనకెంతో ప్రీతిపాత్రుడైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవను వీక్షించేందుకు వేలాది మంది భక్తులు సోమవారం ఉదయానికే చేరుకున్నారు.
Samayam Telugu గరుడ వాహనసేవ


‘నానా దిక్కుల నరులెల్లా..’ అంటూ అన్నమయ్య కీర్తించిన రీతిలో లక్షలాదిగా భక్తజనం తరలిరావడంతో తిరుమల భక్తజనంతో నిండిపోయింది. గరుడ సేవలో ధ్రువమూర్తి వేంకటేశ్వరస్వామికి, ఉత్సవమూర్తి మలయప్పస్వామికి భేదం లేదు. అందుకే మలయప్పస్వామిని గరుడ వాహనంపై ఉండగా వీక్షించడం మోక్షదాయకం.

గరుడ సేవ సందర్భంగా మూలవిరాట్టుకు నిత్యం అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాల వంటి విశిష్ట అభరణాలను మలయప్పస్వామికి అలంకరిస్తారు. గరుడోత్సవాన్ని వీక్షిస్తే వైకుంఠ ప్రాప్తిస్తుంది. శ్రీవిల్లిపుత్తూరు ఆలయం నుంచి పూలమాలలు, చెన్నైనుంచి ఛత్రాలు తిరుమలకు తరలించి గరుడోత్సవంలో స్వామికి అలంకరిస్తారు. గరుత్మంతుడు విష్ణువుకు వాహనం. అలాగే ధ్వజం కూడా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.