యాప్నగరం

సౌదీ వీరుల సమాధే... బారా షహీద్ దర్గా

బారా షహీద్ దర్గా రొట్టెల దర్గాగా ప్రసిద్ధి చెందింది.

TNN 2 Oct 2017, 2:09 pm
నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండగకు జనం తండోత తండాలుగా వచ్చిపోతున్నారు. ప్రతి ఏటా మూడు రోజుల పాటూ ఈ పండుగ జరుగుతుంది. స్వర్ణాల చెరువులో స్నానం చేసి, రొట్టెల పంచి, దర్గాను సందర్శిస్తారు. ఇంతకీ ఈ దర్గా ఎవరిది? ఏ కాలం నాటిది?
Samayam Telugu story behind the bara shaheed dargah in nellore
సౌదీ వీరుల సమాధే... బారా షహీద్ దర్గా


బారా షహీద్ దర్గా రొట్టెల దర్గాగా ప్రసిద్ధి చెందింది. ఇది దాదాపు 400 ఏళ్ల క్రితంనాటి దర్గా అని చరిత్రకారులు చెబుతున్నారు. వారు చెప్పిన కథనాల ప్రకారం... 1751లో ఇస్లాం మతాన్ని ప్రచారం చేసేందుకు 12 మంది మతప్రబోధకులు సౌదీ అరేబియా నుంచి ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో తమిళనాడు, నెల్లూరు ప్రాంతాలను నవాబులు పాలించేవారు. కాగా సౌదీ నుంచి వచ్చిన ప్రబోధకులు నెల్లూరు జిల్లా దగ్గరి కొడవలూరుకు వెళతారు. అక్కడ ఇతర మతస్థులు వీరిని అడ్డుకుంటారు. వారితో ఈ 12 మంది వీరోచితంగా పోరాడతారు. ఆ పోరాటంలో సౌదీ వీరులు మరణిస్తారు. అలా చనిపోయిన 12 మంది మృతదేహాలను గుర్రాలు లాక్కొచ్చి స్వర్ణాల చెరువు పక్కన వదిలేస్తాయి. ఆ మృతదేహాలు అక్కడే భూమిలో కలిసిపోతాయి. స్థానికులు ఆ ప్రదేశాలలోనే వారికి సమాధులు కట్టేస్తారు. 12ని హిందీలో బారహ్ అని, అమరులైన వారిని షహీద్ అని అంటారు కాబట్టి... ఆ దర్గాకు బారాషహీద్ దర్గా అని పేరు వచ్చింది. ఆ దర్గానే నేటి రొట్టెల దర్గా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.