యాప్నగరం

అరసవల్లి: ఆదిత్యుని స్పృశించిన కిరణాలు.. పులకించిన భక్తులు

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని కస్యప మహర్షి కట్టించాడని పద్మ పురాణం వెల్లడిస్తే, సాక్షాత్తు ఇంద్రుడే దీనిని నిర్మించాడని కొందరంటారు.

Samayam Telugu 4 Dec 2022, 11:00 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలోని మూలవిరాట్టును సోమవారం ఉదయం సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి. ఆదిత్యుని పాదాలను స్పృశించేందుకు భానుడు చేసిన ప్రయత్నానికి మేఘాలు అడ్డుపడటంతో భక్తులు ఒకింత నిరాశకు గురయ్యారు. అయితే, క్షణాల వ్యవధిలోనే ముబ్బులు తొలగి స్వామివారి ముఖాన్ని కిరణాలు తాకడంతో భక్తులు తన్మయత్వం చెందారు. ఉత్తరాయణం నుంచి దక్షిణాయణానికి సూర్యుడు మారే సందర్భంలో కిరణస్పర్శ మూలవిరాట్టును తాకడం ఆనవాయితీగా వస్తోంది. సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా ఇక్కడ కనువిందు చేస్తోంది. కేవలం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మాత్రమే ఈ దృశ్యం గోచరిస్తుంది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.
Samayam Telugu Sun Temple


రథసప్తమితోపాటు మార్చి 9, 10 తేదీలు, అలాగే అక్టోబరు 1, 2 తేదీల్లోనూ సూర్యకిరణాలు మూలవిరాట్టును తాకుతాయి. సోమవారం ఈ దృశ్యాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కనులారా వీక్షించారు. సూర్యకిరణాలు ఆలయంలోని సూర్యభగవానుడిని తాకే సమయంలో స్వామివారిని దర్శించుకుంటే విజయం తథ్యమని భక్తులు విశ్వసిస్తుంటారు. మన దేశంలోని సూర్యదేవాలయాలలో ఇది అత్యంత ప్రాచీనమైనది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కస్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. సాక్షాత్తు ఇంద్రుడే ఈ ఆలయం నిర్మించాడని, దీని పక్కనే ఉన్న కోనేరును ఇంద్ర పుష్కరిణి అని అంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.