యాప్నగరం

Kohinoor and Puri Temple పూరి జగన్నాథ ఆలయానికి.. కోహినూర్ వజ్రానికి ఉన్న లింకేంటి.. ఈ రెండింటి మధ్య వీడని రహస్యాలెన్నో...

Kohinoor Diamond and Puri Temple Mysteries విశ్వంలోనే అత్యంత విలువైనదిగా పేరుగాంచిన కోహినూర్ వజ్రం పూరి జగన్నాథుడిదేనని, దాన్ని మన దేశానికి తెప్పించాలంటూ డిమాండ్ పెరుగుతోంది. ఈ సందర్భంగా కోహినూర్ వజ్రానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు.. పూరి జగన్నాథుని ఆలయానికి ఈ వజ్రానికి ఉన్న లింకేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 14 Sep 2022, 2:33 pm
Kohinoor Diamond and Puri Temple mysteries in Telugu ప్రపంచంలో ఎన్ని విలువైన వజ్రాలున్నప్పటికీ.. కోహినూర్ వజ్రానికి ఉన్న ప్రత్యేకతే వేరు. అదే విధంగా ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథుని ఆలయంలో ఎన్నో వింతలు, విశేషాలు ఇప్పటికీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కోహినూర్ వజ్రం, పూరి జగన్నాథ ఆలయానికి ఉన్న సంబంధించిన అంశం గురించి మరోసారి చర్చలు వెలుగులోకొచ్చాయి. ఈ విలువైన వజ్రం పూరి జగన్నాథుడిదేనని, దాన్ని మన దేశానికి తెప్పించాలంటూ డిమాండ్ పెరుగుతోంది. ఈ సందర్భంగా కోహినూర్ వజ్రానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు.. పూరి జగన్నాథుని ఆలయానికి ఈ వజ్రానికి ఉన్న లింకేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu the history and mystery of the kohinoor diamond and puri temple in telugu
Kohinoor and Puri Temple పూరి జగన్నాథ ఆలయానికి.. కోహినూర్ వజ్రానికి ఉన్న లింకేంటి.. ఈ రెండింటి మధ్య వీడని రహస్యాలెన్నో...


కాకతీయుల కాలంలోనే కోహినూర్..

చరిత్రను పరిశీలిస్తే భారతదేశంలో 14వ శతాబ్దంలో కాకతీయుల పాలనలో దక్షిణ భారతంలోని కొల్లూరు గనిలో బొగ్గు తవ్వకాల సమయంలో ఇది బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ వజ్రం మగాళ్ల వద్ద లక్ కలసిరాదని చాలా మంది నమ్ముతారు. అందుకే బ్రిటీష్ సామ్రాజ్యంలోకి ఇది చేరినప్పటి నుంచి ఆ రాజ్యంలోని మహిళలు మాత్రమే ఈ వజ్రం ఉండే కిరీటాన్ని ధరిస్తున్నారు.

Yamraj Temple ఆ గుడిలోకి వెళ్లాలంటే అందరూ భయపడతారు.. కారణం తెలిస్తే షాకవుతారు..

​కోహినూర్ వజ్రంపై కొన్ని అపొహలు..

కోహినూర్ వజ్రం తమదేనంటూ పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్, ఇరాన్ వంటి దేశాల ప్రతినిధులు 1976లోనే బ్రిటన్ ప్రధానికి లేఖలు రాశారు. అయితే వాటిని బ్రిటీష్ పాలకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. మరోవైపు ఈ కోహినూర్ డైమండ్ ను కేవలం ఆడవారే ధరించాలనే సంప్రదాయం నడుస్తోంది. ఒకవేళ అలా వీలుకాకపోతే దేవుని ఆభరణాల్లో మాత్రమే ఈ వజ్రాన్ని పొదగాలనే విశ్వాసాలు కూడా ఉన్నాయి. ఒకవేళ పొరపాటున ఈ వజ్రాన్ని మగాళ్లు ధరిస్తే రక్తపాతం జరుగుతుందని చరిత్రకారులు చెబుతారు.

​ఎన్నో విలువైన వస్తువులు..

1849 సంవత్సరంలో లాహోర్ ఒప్పందంలో భాగంగా ఈ వజ్రాన్ని తీసుకుని అప్పటి లాహోర్ మహారాజు దిలీప్ సింగ్ బ్రిటీష్ పాలకులకు అప్పగించారని, దీంతో వారి రాజాభరణాల్లోనే అది మరింత ప్రత్యేకత సంతరించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఎన్నో విలువైన వస్తువులు మన దేశం దాటినా.. తిరిగి మన ప్రాంతానికి చేరిన ఆధారాలున్నాయి. అలాంటి వాటి స్థానంలో కోహినూర్ వజ్రం కూడా చేరాలనేది ప్రస్తుతం వినిపిస్తున్న డిమాండ్.

నల్లమల ప్రాంతంలో..

కేవలం 21.1204 గ్రాముల బరువు తూగే కోహినూర్ వజ్రంలో 105.602 క్యారెట్లు ఉంటుంది. 66 ముఖాలుండే ఈ వజ్రం 3.6 సెంటిమీటర్ల పొడవు, 3.2 సెంటిమీటర్ల వెడల్పు, 1.3 సెంటిమీటర్ల లోతులో కనిపిస్తుంది. 1980లో ‘ది కోహినూర్ డైమండ్ - ది హిస్టరీ ది లెజెండ్’ అనే పుస్తకంలో ఈ వజ్రం తెలుగు రాష్ట్రాల్లోని కొల్లూరు ప్రాంతంలో లభ్యమైనట్లు రాశారు. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నల్లమల కొండల అంచుల్లో ఉన్న కొల్లూరు అప్పట్లో భారత ఉపఖండంలో అతి పెద్ద గనులకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం. అప్పట్లో ఇది గోల్కొండ రాజ్యంలో ఉండేది.

తొలిసారిగా ఎక్కడంటే..

16వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా ఈ వజ్రం ఓ మహిళకు దొరికిందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ వజ్రం తొలిసారిగా కాకతీయులకు దొరికిందని, వారి నుంచి ఢిల్లీ పాలకులకు, అక్కడి నుంచి మాల్కా రాజుకు, ఆ తర్వాత తిరిగి ఢిల్లీ రాజులకు, ఆ తర్వాత మళ్లీ గోల్కొండ రాజ్యానికే ఈ వజ్రం చేరిందని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే 1813లో కోహినూర్ వజ్రం మహారాజా రంజిత్ సింగ్ దగ్గరికి వచ్చిందట. తను మరణించిన తర్వాత ఆయన కుమారుడు దిలీప్ సింగ్ బ్రిటీష్ వారి చేతిలో ఓడిపోయి.. వారికి ఆ వజ్రాన్ని అప్పగించినట్లు తెలుస్తోంది.

​పూరి జగన్నాథుడికి కానుకగా..

ఈ కోహినూర్ వజ్రాన్ని అప్పటి పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ పూరి జగన్నాథుడికి కానుకగా సమర్పిస్తానని చెప్పినట్లు బ్రిటీష్ ఆర్మీ అధికారి నిర్ధారించిన పత్రం ఢిల్లిలోని నేషనల్ ఆర్కైవ్స్ లో స్పష్టంగా ఉంది. అయితే తను దాన్ని సకాలంలో అందజేయలేకపోయారని, అంతలోనే తను మరణించారని, ఆ తర్వాత తన కుమారుడు బ్రిటీష్ రాణికి అప్పగించినట్లు తెలుస్తోంది.

​జగన్నాథ ఆలయ రహస్యాలు..

ఇక పూరి జగన్నాథుని ఆలయంలో ఇప్పటికీ అనేక మిస్టరీలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయ గోపురంపై ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడి గోపురంపై ఉండే సుదర్శన చక్రం ఎటువైపు నుంచి చూసినా ఒకే మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షలు ఎప్పటికీ ఎగరవు. పగటి పూట ఈ ఆలయం నీడ కూడా మనకు ఎక్కడా కనిపించదు. ఈ దేవాలయంలో నాలుగు ద్వారాలు ఉంటాయి. వీటిలో సింఘ ద్వారమే ప్రధాన మార్గం. ఇక్కడి నుండి ప్రవేశించినప్పుడు మీరు సాగరం నుంచి వచ్చే అలల శబ్దాన్ని వినొచ్చు. అయితే ఈ గుడిలోపలకి వెళ్లిన మరుక్షణం ఎలాంటి శబ్దం వినిపించదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది.

రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.