భారతంలోని ఈ యోధుడు ఇద్దరి గర్భంలో పెరిగి...
మహాభారతాన్ని పంచమ వేదంగా పేర్కొంటారు. ఇందులో అనేక ఆసక్తికరమైన కథలే కాదు, సైన్స్కు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి.
TNN 29 May 2017, 6:35 pm
మహాభారతాన్ని పంచమ వేదంగా పేర్కొంటారు. ఇందులో అనేక ఆసక్తికరమైన కథలే కాదు, సైన్స్కు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఆదరణ పొందుతోన్న టెస్ట్ట్యూబ్ బేబీ, క్లోనింగ్, లైవ్ టెలికాస్ట్ లాంటి ఎన్నో విషయాలను వేదవ్యాసుడు కొన్ని వేల సంవత్సరాల కిందటే చర్చించాడు. దాన గుణంలో కర్ణుడితో సమానమైన ఓ యోధుడు మాత్రం ఇద్దరు తల్లుల గర్భంలో పెరిగాడు. తూర్పు భారతంలో శక్తివంతమైన మగధ రాజ్యానికి బృహధ్రతుడు రాజు.ఈయనకు ఇద్దరు భార్యలు. వీరికి సంతానం లేకపోవడంతో తీవ్ర వేదన చెందాడు.
దీంతో చందకౌశిక మునిని ఆశ్రయించాడు. మహర్షి ఓ ఫలాన్ని ప్రసాదించి రాణికి ఇవ్వమని చెబితే, దాన్ని చెరిసగం చేసి ఇద్దరికీ అందించాడు. ఆ తర్వాత ఇద్దరు భార్యలు గర్భం దాల్చారు. అయితే ఈ ఇద్దరూ సగం శరీరాలున్న శిశువులను ప్రసవించారు. దీంతో బృహధ్రతుడు భయపడి వాటిని అడవిలోకి విసిరేశాడు. తర్వాత చందకౌశిక మహర్షిని దర్శనం కోసం ఆశ్రమానికి వెళ్లాడు. అదే సమయంలో ఆ
అడవి గుండా ఓ రాక్షసి వెళుతూ సగం శరీర భాగాలు కలిగిన శిశువులను చూసి తన శక్తులతో ఆ రెండింటినీ కలుపుతుంది. అంతే కాదు వాటికి ప్రాణం పోస్తుంది.
బృహధ్రతుడు ముని దర్శనం చేసుకుని వెళుతుండగా ఓ బాలుడు ఏడు వినిపించడంతో అక్కడకు చేరుకుని ఆశ్చర్యపడతాడు. శిశువుల విడిభాగాలను కలిపిన స్త్రీని ఎవరని ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె నా పేరు జర అనే రాక్షసి అని తెలియజేస్తుంది. ఆ బాలుడు జరతో ప్రాణపోసుకున్నాడు కాబట్టి జరాసంధుడు అని నామకరణం చేస్తాడు. మగధ సింహాసనాన్ని అధిష్ఠించిన జరాసంధుడు గొప్ప శివభక్తుడు. అంతే కాదు దానధర్మాల్లో కర్ణుడితో సమానంగా ఉండేవాడు. అడిగిన వారికి కాదనకుండా విరివిగా దానాలు చేసేవాడు. అయితే యాదవులంటే మాత్రం ప్రతీకారంతో రగిలిపోయేవాడు. ముఖ్యంగా కౌంసుని సంహరించిన కృష్ణుడంటే మరింత ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. దీంతో పాండవులపై కూడా వైరం పెంచుకున్నాడు. చివరికి భీముడితో 14 రోజులు యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయాడు. జరాసంధుడి శరీరాన్ని రెండు భాగాలు చేసిన భీముడు వాటిని చెరో దిక్కున విసిరేశాడు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని జరాసంధ క ఆఖారా అన్ని పిలుస్తున్నారు. ఇది బీహార్లోని రాజ్గిరి పట్టణంలో
ఉంది.
దీంతో చందకౌశిక మునిని ఆశ్రయించాడు. మహర్షి ఓ ఫలాన్ని ప్రసాదించి రాణికి ఇవ్వమని చెబితే, దాన్ని చెరిసగం చేసి ఇద్దరికీ అందించాడు. ఆ తర్వాత ఇద్దరు భార్యలు గర్భం దాల్చారు. అయితే ఈ ఇద్దరూ సగం శరీరాలున్న శిశువులను ప్రసవించారు. దీంతో బృహధ్రతుడు భయపడి వాటిని అడవిలోకి విసిరేశాడు. తర్వాత చందకౌశిక మహర్షిని దర్శనం కోసం ఆశ్రమానికి వెళ్లాడు. అదే సమయంలో ఆ
అడవి గుండా ఓ రాక్షసి వెళుతూ సగం శరీర భాగాలు కలిగిన శిశువులను చూసి తన శక్తులతో ఆ రెండింటినీ కలుపుతుంది. అంతే కాదు వాటికి ప్రాణం పోస్తుంది.
బృహధ్రతుడు ముని దర్శనం చేసుకుని వెళుతుండగా ఓ బాలుడు ఏడు వినిపించడంతో అక్కడకు చేరుకుని ఆశ్చర్యపడతాడు. శిశువుల విడిభాగాలను కలిపిన స్త్రీని ఎవరని ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె నా పేరు జర అనే రాక్షసి అని తెలియజేస్తుంది. ఆ బాలుడు జరతో ప్రాణపోసుకున్నాడు కాబట్టి జరాసంధుడు అని నామకరణం చేస్తాడు. మగధ సింహాసనాన్ని అధిష్ఠించిన జరాసంధుడు గొప్ప శివభక్తుడు. అంతే కాదు దానధర్మాల్లో కర్ణుడితో సమానంగా ఉండేవాడు. అడిగిన వారికి కాదనకుండా విరివిగా దానాలు చేసేవాడు. అయితే యాదవులంటే మాత్రం ప్రతీకారంతో రగిలిపోయేవాడు. ముఖ్యంగా కౌంసుని సంహరించిన కృష్ణుడంటే మరింత ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. దీంతో పాండవులపై కూడా వైరం పెంచుకున్నాడు. చివరికి భీముడితో 14 రోజులు యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయాడు. జరాసంధుడి శరీరాన్ని రెండు భాగాలు చేసిన భీముడు వాటిని చెరో దిక్కున విసిరేశాడు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని జరాసంధ క ఆఖారా అన్ని పిలుస్తున్నారు. ఇది బీహార్లోని రాజ్గిరి పట్టణంలో
ఉంది.