యాప్నగరం

చంద్రప్రభ వాహనంపై ఉరేగిన స్వామివారు

కలియుగ దైవం ఏడుకొండల వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఘనంగా అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి.

TNN 10 Oct 2016, 4:11 am
కలియుగ దైవం ఏడుకొండల వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఘనంగా అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల ఏడోరోజు ఉదయం సూర్యప్రభ వాహనంలో ఉరేగిన స్వామివారు, రాత్రిపూట చంద్రప్రభ వాహనంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇలా సూర్యుడు, చంద్రుడి వాహనాల్లో ఊరేగడం ద్వారా స్వామివారు వారిద్దరూ తనకు రెండు నేత్రాలవంటివారని నిరూపించారని పురాణపండితులు తెలిపారు. సూర్య, చంద్ర ప్రభ వాహనాలపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి, సమస్థ సంపదలు సమకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.