యాప్నగరం

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. ఒక్క రోజే రూ.6.28 కోట్లు!

నేడు ఎలాంటి విశేషం లేకపోయినా తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం కనీవినీ ఎరుగుని రీతిలో సమకూరింది. ఇప్పటి వరకు శ్రీవారి ఆలయ చరిత్రలో నమోదైన రికార్డులను అధిగమించింది.

Samayam Telugu 26 Jul 2018, 8:07 pm
శుక్రవారం నాడు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డుస్థాయిలో రూ.6.28 కోట్లు వచ్చింది. ఒక్కరోజే ఇంత పెద్ద మొత్తంలో హుండీ ఆదాయం సమకూరడం శ్రీవారి ఆలయ చరిత్రలోనే తొలిసారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 2012 శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వచ్చిన రూ.5.73 కోట్లే ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉంది. ఇక పెద్ద నోట్లు రద్దు తర్వాత 2017 మార్చి 28 న రూ.5 కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరింది. గత పదేళ్లుగా స్వామివారి హుండీ ఆదాయం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. సగటున రూ.కోటి దాటుతోంది. అజ్ఞాత భక్తులు అధిక మొత్తంలో స్వామివారికి నిధులు సమర్పించిన సమయంలో ఇది 2 నుంచి 3 కోట్లు దాటుతోంది. శ్రీవారి ఆలయ చరిత్రలోనే ఇంత అధిక మొత్తం హుండీ ఆదాయం నేడు రావడం చెప్పుకోదగ్గ అంశం.
Samayam Telugu TTD


ఇక 80 వ దశకంలో శ్రీవారి హుండీ ఆదాయం రోజుకు రూ.లక్ష వస్తేనే విశేషంగా భావించేవారు. అప్పట్లో అజ్ఞాత భక్తుల సమర్పించిన కానుకలు కూడా రూ.లక్ష దాటేవి కావు. అయితే, 1990 నుంచి స్వామివారికి కానుకలు పెరిగాయి. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా హుండీ ఆదాయం కూడా ఎన్నో రెట్లు పెరుగుతూ వస్తోంది. నగదుతోపాటు వెండి, బంగారం, ఆభరణాలు, ఇతర కానుకలను కూడా భక్తులు అధికమొత్తంలో సమర్పించుకుంటున్నారు. 2012 శ్రీరామ నవమి వరకు అత్యధికంగా వచ్చిన ఆదాయం రూ.3.75 కోట్లు.

మరోవైపు హర్ష టయోటా చీఫ్ హర్షవర్ధన్ రూ.12 లక్షలు ఖరీదు చేసే వాహనం స్వామికి విరాళంగా ఇచ్చారు. గురువారం నాడు స్వామిని దర్శించుకున్న ఆయన డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్‌‌కు తాళాలను అప్పగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.