యాప్నగరం

తిరుమల: అర్చకుల మధ్య విభేదాలు.. మహిళలను గదిలోకి పంపి..

తిరుమలలో ఇద్దరి అర్చకుల మధ్య తలెత్తిన విభేదాలు సినీ ఫక్కీలో డ్రామాకు తెరతీశాయి. శ్రీవారి ఆలయంలో సంభావన అర్చకులుగా పనిచేసే మారుతి, మణికంఠల మధ్య వ్యక్తిగత తగాదాలున్నాయి.

Samayam Telugu 30 Oct 2018, 5:03 pm
Samayam Telugu tirupati-.
తిరుమలలో ఇద్దరి అర్చకుల మధ్య తలెత్తిన విభేదాలు సినీ ఫక్కీలో డ్రామాకు తెరతీశాయి. శ్రీవారి ఆలయంలో సంభావన అర్చకులుగా పనిచేసే మారుతి, మణికంఠల మధ్య వ్యక్తిగత తగాదాలున్నాయి. ఈ క్రమంలో మణికంఠ వ్యక్తిత్వాన్ని చెడుగా చూపించాలనే దురుద్దేశంతో మారుతి పథకం ప్రకారం ఇద్దరి మహిళలతో అతడిపై దాడి చేయించాడు. అర్చక నిలయంలోని మణికంఠ గదికి ఆ ఇద్దరి మహిళలను పంపి, అతడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. గదిలోకి ప్రవేశించిన ఆ ఇద్దరు మహిళలు మణికంఠను కొట్టి, కేకలు వేస్తూ హడావుడి చేశారు. పెద్దగా అరుస్తూ మహిళలు బయటకు రావడంతో టీటీడీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. వారిని విజిలెన్స్ అధికారులు విచారించగా అసలు విషయం బయటపెట్టారు. అర్చకుడు మారుతి కావాలనే మణికంఠ గదికి పంపినట్టు అంగీకరించారు. ఇందుకు రూ.లక్ష కూడా ఇచ్చాడని తెలిపారు.

దీనిపై బాధిత అర్చకుడు మణికంఠ మాట్లాడుతూ... గుర్తుతెలియని ఇద్దరు మహిళలు తన గది దగ్గరకు వచ్చారని తెలియజేశాడు. వీరిలో 50ఏళ్లు పైబడిన మహిళను ఎందుకొచ్చారని ప్రశ్నిస్తే.. తన భర్తకు ఆరోగ్యం బాగాలేదని, ఆయన కోసం మీ వద్దకు వచ్చానని చెప్పిందన్నారు. ఆరోగ్యం బాగాలేకపోతే దేవుడి దగ్గరకు వెళ్లి ప్రార్థించాలి గానీ, ఇక్కడకు వస్తే నేనేం చేయగలని అన్నట్టు మణికంఠ తెలిపాడు. ఇలా మాట్లాడుతుండగా బూతులు తిడుతూ, దాడిచేసిందని పేర్కొన్నాడు. ఏం జరుగుతుందో తెరుకునేలోగా తనను తోసేసి పెద్దగా కేకలు వేస్తూ బయటకు వెళ్లిపోయిందని అర్చకుడు వెల్లడించాడు. మహిళలు వెల్లడించిన వివరాలతో మారుతిపై చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.