యాప్నగరం

చంద్రగ్రహణం.. సాయంత్రం నుంచి శ్రీవారి ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం మూసివేయనున్నట్లు తితిదే జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు.

Samayam Telugu 27 Jul 2018, 10:09 am
చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం మూసివేయనున్నట్లు తితిదే జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 11.54 గంటల నుంచి శనివారం తెల్లవారు జామున 3.49 గంటల వరకు గ్రహణ గడియలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో.. శ్రీవారి ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం 5 గంటలకే మూసివేయాలని నిర్ణయించినట్లు జేఈవో వివరించారు.
Samayam Telugu tirupati-balaji_1457082070.


గ్రహణానంతరం శనివారం వేకుమజామున 4.15 తర్వాత గుడి తలుపులు తెరిచి.. సుప్రభాతం, శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తామని శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆ తర్వాత శ్రీవారికి తోమాల, కొలువు, పంచాగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించి.. శనివారం ఉదయం 7 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ఆయన వివరించారు. గ్రహణ సమయంలో ఆలయాన్ని మూసివేస్తుండటంతో.. భక్తులను కంపార్ట్‌మెంట్‌‌లో వేచి ఉండటానికి కూడా అనుమతించమని.. అన్న ప్రసాద వితరణ కూడా నిలిపేస్తున్నట్లు జేఈవో ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.