యాప్నగరం

జులై 4 నుంచి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం: ప్రభాతవేళలో వెంకటాద్రి ఎక్కితే..

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవారిని దర్శించుకోడానికి భక్తులు కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. నాటి మహర్షులు, అన్నమయ్య లాంటి ఎందరో మహానుభావులు మెట్ల మార్గంలో పయనించి దేవదేవుని దర్శించుకున్నారు.

Samayam Telugu 26 Jun 2019, 3:24 pm
టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జులై 4 నుంచి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి మూడో సత్ర ప్రాంగణంలో ప్రారంభమవుతాయి. జులై 4, 5 తేదీల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన భజన మండళ్లు ఉదయం 5.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు, ఇతర సాంస్క తిక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. జులై 4న సాయంత్రం 4 గంటలకు శ్రీగోవిందరాజస్వామి ఆలయం నుంచి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. అనంతరం అధికార ప్రముఖులు సందేశమిస్తారు. జూలై 6న ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.
Samayam Telugu Metlotsavam


Read Also: జులై 2న సూర్యగ్రహణం.. గర్భిణీలకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

శ్రీవేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం, శ్రీనివాసుడికి సరితూగే పరదైవం ఈ బ్రహ్మాండంలో లేదని వ్యాసమహర్షి కీర్తించారు. ప్రభాత సమయంలో ఈ కొండను అధిరోహించిన వారికి వేయిసార్లు కాశీ-రామేశ్వర యాత్ర చేసిన ఫలం దక్కుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. పూర్వకాలంలో మహర్షులు, రాజర్షులు, పురందరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, శ్రీక ష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపడుతోంది. ఇలా కాలినడకన వెళ్లి సప్తగిరీశుని దర్శిస్తే వారికి సకల అరిష్టాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.