అంకురార్పణతో ఆరంభం..
2022 సంవత్సరంలో ఆగస్టు ఏడో తేదీ అంటే శ్రావణ సోమవారం, ఏకాదశి తిథి నుండి శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో వెంకన్న గుడిలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఈ మేరకు తిరుమల పండితులు ఆగస్టు ఆరో తేదీన ఆదివారం రాత్రే శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం సంపంగి ప్రాకారంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.
ఈసారి రాఖీ ఎప్పుడు కట్టాలి? 11న లేదా 12న.. పౌర్ణమి తిథి ఎప్పుడంటే..
తొలిసారిగా ఎప్పుడంటే..
టిటిడి అధికారిక సమాచారం మేరకు.. ఈ ఉత్సవాలను తొలిసారిగా 1463 సంవత్సరంలో సాలువ మల్లయ్య దేవరాజా ఆధ్వర్యంలో నిర్వహించారు. 15-16వ శతాబ్దాల్లో ఈ ఉత్సవాలు జరిగినట్టు కొన్ని ఆధారాలున్నాయి. అయితే చరిత్ర ప్రకారం.. 1962 నుండి టిటిడి ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
ప్రత్యేక అలంకరణలు..
ఈ మూడు రోజుల పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాలను తిరుమంజనం చేస్తారు. అలాగే హోమం కూడా నిర్వహిస్తారు. సాయంకాలం సంధ్యా వేళలో స్వామివారి విగ్రహాలకు ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. అదే సమయంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు తిరుమల మాఢ వీధుల్లో విహరించి భక్తులందరికీ దర్శనమిస్తారు. అనంతరం పవిత్రాల ప్రతిష్ట, మంగళవారం రోజున పవిత్ర సమర్పణ, ఆ తర్వాత పుర్ణాహూతి కార్యక్రమాలను నిర్వహిస్తారు.
Raksha Bandhan 2022 ఈ ఏడాది మీ సోదరుల రాశిని బట్టి ఏ కలర్ రాఖీ కట్టాలంటే..
దోష నివారణలిలా..
పవిత్రోత్సవాలను ‘దోష నివారణ’, ‘సర్వయజ్ఞ ఫలప్రద’, ‘సర్వ దోష ఉపశమన’, ‘సర్వ తుష్టికర’ ‘సర్వకామప్రద’ మొదలైన పేర్లతో పిలుస్తారు. పవిత్రం, ఉత్సవం అనే రెండు పదాల కలయిక వల్ల పవిత్రోత్సవం ఏర్పడింది. చారిత్రక ఆధారాల మేరకు.. శ్రీవారి ఆలయంలోని ఉత్సవమూర్తులను పవిత్రాలు చేయడానికి గాను శ్రేష్ఠమైన జాతి పత్తి మొక్కలను పవిత్రమైన భగవంతుని మొక్కగా భావించే తులసిని పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం ప్రత్యేకం.
పవిత్రాలను ఎలా చేస్తారంటే..
పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలు దారాన్ని ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపు, నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చని రంగులను అద్దకం చేస్తారు. ఆలయంలోని మొదటి ప్రాకారంలోని వగపడి వరండాలో ఉత్తరం వైపున రాతి గోడపై పవిత్రోత్సవాల రెక్కలకు సంబంధించిన పురాతన శాసనం కూడా లభ్యమైనంది. ‘పవిత్ర తిరునాల్’ పేరిట నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఈ వస్తువుల జాబితా, వాటి ధరలు దొరికాయి.