యాప్నగరం

తిరుమలలో 243 మంది క్షురకులకు ఉద్వాసన

శ్రీవారికి తలనీలాలు సమర్పించుకునేందుకు వచ్చిన భక్తుల నుంచి కానుకల రూపంలో డబ్బులు డిమాండ్ చేస్తున్న క్షురకులకు టీటీడీ ఉద్వాసన పలికింది.

TNN 15 Oct 2017, 1:11 pm
శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు రోజూ వేలాది మంది భక్తులు తిరుమల తరలి వెళ్తుంటారు. తిరమలేశుడికి తలనీలాలు కానుకగా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటుంటారు. కానీ తల నీలాలు సమర్పించే సమయంలో.. అక్కడి క్షురకుల బాదుడు గురించి అక్కడికెళ్లిన ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఏదో మీ తృప్తి కొద్ది ఇవ్వండి అంటూనే.. డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. అందరూ అని కాదు కానీ చాలా మందిదీ ఇదే తరహా. కత్తి గాట్ల భయంతో భక్తులు కూడా వారికి ఎంతో కొంత ముట్టజెప్తుంటారు. ఈ విషయమై టీటీడీకి చాలా ఏళ్లుగా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.
Samayam Telugu ttd fires 243 barbers for taking tips from pilgrims
తిరుమలలో 243 మంది క్షురకులకు ఉద్వాసన


కాంట్రాక్టు ప్రాతిపదికన డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ.. భక్తుల దగ్గర్నుంచి ఇలా డబ్బులు డిమాండ్ చేయడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 243 క్షురకులను విధుల నుంచి తొలగించింది. కల్యాణ కట్టల వద్ద భక్తులకు గుండు చేయడం కోసం టీటీడీ ట్రస్టు 943 మంది నాయి బ్రాహ్మణులను కాంట్రాక్ట్ ప్రతిపాదికన నియమించింది. వీరంతా షిప్టుల వారీగా రోజంతా పని చేస్తారు.

ఒక్కసారిగా భారీ సంఖ్యలో క్షురకులను తొలగించడంతో.. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. నాయీ బ్రాహ్మణ సంఘం టీటీడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. తమ వారికి జీవనోపాధిని దూరం చేయొద్దని కోరింది. కాగా గుండు చేసినందుకు గానూ.. ఒక్కో భక్తుడి నుంచి రూ. 10 నుంచి రూ. 50 వరకు డిమాండ్ చేస్తున్నారని.. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తమ దగ్గర ఉన్నాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.