యాప్నగరం

నిజమైన ధర్మం అంటే ఏంటి?

శోకమనేది నివృత్తి కావాలంటే ఒకటి మానవ ప్రయత్నం, రెండు ఈశ్వరానుగ్రహం ఉండాలి. ప్రయత్నం చేస్తేగానీ అనుగ్రహం ఉండదు. వాస్తవానికి ఆయన ఎక్కడో లేడు. మనలోనే ఉన్నాడు..

Samayam Telugu 10 Jun 2018, 5:37 pm
ధర్మం లేదా మతం అనేది ప్రత్యేకించి ఒక మత సిద్ధాంతానికి సంబంధించింది కాదు. అలాంటప్పుడు నిజమైన ధర్మం ఏంటి? అంటే, ‘ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం’ భగవంతుడు దేనినైతే నిర్దేశించాడో అదే నిజమైన ధర్మం. రాజ్యాంగానికి సంబంధించిన చట్టం ప్రభుత్వంతో ఎలా విధించబడి ఉంటుందో అదే విధంగా దేవదేవుని చేత విధించబడేది అసలైన ధర్మం. భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఆయన ఆదేశం కూడా ఒక్కటే అయి ఉండాలి. మరి ఇన్ని రకాల ధర్మాలు ఎలా ఉంటాయి? అది సాధ్యం కాదు. ధర్మం పేరిట భిన్నమైన అభిప్రాయానికి రావడం అఙ్ఞానం వలన మాత్రమే జరుగుతుంది. హిందూ ధర్మం, ముస్లిం ధర్మం, క్రైస్తవ ధర్మం ... ఇలా ఎన్నో మతపరమైన ధర్మాలు ఉన్నాయి.
Samayam Telugu భగవద్గీత


ఉదాహరణకు బంగారం అంటే బంగారమే.. అంతేగానీ క్రైస్తవుల వద్ద ఉన్నది క్రిస్టియన్ల బంగారం, హిందువుల వద్ద ఉన్నది హిందువుల బంగారం అవుతుందా? లేదు సువర్ణం ఎక్కడ ఉన్నా సువర్ణమే. అదే విధంగా భగవంతునికి దాసోహమవడమనేది పరిపూర్ణమైన ధర్మం.

సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ! , అహం త్వా సర్వ పాపేభ్యోమోక్ష యిష్యామి మా శుచ! అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి నీవుకాదు, నిరంతరం నువ్వు నువ్వుగానే ఉండు. సర్వ పాపాల నుంచి మోక్షం పొందుతావు. పనికిరాని కోర్కెలతో, తెలివి తక్కువ తనంతో అప్రామాణికమైన కర్మలు ఆచరిస్తున్న వారు క్రూరత్వం, అసుర స్వభావం పెంచుకుంటూ, మందబుద్ధులై మాయలో పడిపోతుంటారు... ధర్మాన్ పరిత్యజ్య అంటే సర్వ ధర్మాలను పరిత్యజించి తననే శరణు పొందమని కృష్ణుడు ఆనాడే చెప్పాడు. ఇదే భాగవత ధర్మం.. భగవంతుని ఎలా ఆశ్రయ పొందాలో ప్రతి ఒక్కరికీ నేర్పించాలి.

భగవంతుడు ఒక్కడే, ఇద్దరు ముగ్గురు దేవుళ్లు, వారి మధ్య పోటీ ఉందంటే వారు అసలు దేవుళ్లే కాదు. ప్రతి చోట ఎవరో ఒక దేవుడు ఉండడం ప్రస్తుతం కాలంలో పరిపాటిగా మారిపోయింది. గీతలో భగవానుడు వివరించింది ఇలాంటి దేవుడి గురించి కాదు. అతడు దేవాదిదేవుడు. ‘అన్యథా శరణం నాస్తి’ అని అందరూ ఆశ్రయించాల్సింది అతడినే. అదే పరి పూర్ణమైన ధర్మం.

మనలో అహంకారం నశించినప్పుడు భగవంతుడు మనవాడు అవుతాడు. నేను, నాది, నా అనే అర్థాలకు వాడు, వాడిది, వాడే అనే భావాన్ని జొప్పించాలి. భగవంతుడు తప్ప అన్యం ఏదీ లేదు అనే సత్యానికి మనం దగ్గర కావాలి. ‘సత్య నిష్ఠయే ఈ కలియుగానికి తరుణోపాయం’ అని శ్రీరామకృష్ణులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.