యాప్నగరం

శ్మశానంలో స్త్రీలకు అనుమతి నిరాకరణకు కారణం?

తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు మహిళలను అనుమతించరు. అయితే దీనిపై పంచమవేదమైన మహాభారతంలో పేర్కొన్నారు.

TNN 15 Feb 2017, 4:54 pm
తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు మహిళలను అనుమతించరు. అయితే దీనిపై పంచమవేదమైన మహాభారతంలో పేర్కొన్నారు. మహిళలు అంతిమ యాత్రలో పాల్గోవచ్చని అందులో తెలిపారు. ఈ విషయాలను ఎస్జీ మోఘ్ రాసిన హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర ఇన్ ఎసెన్స్‌లోని ఆరో అధ్యాయమైన మరణాంతర జీవిత చరిత్రలో పొందుపరిచారు.
Samayam Telugu why are women are forbidden from attending funerals
శ్మశానంలో స్త్రీలకు అనుమతి నిరాకరణకు కారణం?


భీష్మ పితామహుడు పార్ధివ దేహాంపై కౌరవ స్త్రీలు వస్త్రాలు, పుష్పాలు, ఛత్రాన్ని ఉంచి కురుకుల యోధుడు దహన సంస్కారాల్లో పాల్గొని నివాళులు అర్పించినట్లు తెలియజేశారు. మహిళలు కూడా తమ తల్లిదండ్రులకు అంతిమ సంస్కారాలు నిర్వహించే హక్కు ఉంటుందని తెలిపారు.


అయితే శ్మశాసనాల్లో స్త్రీలు ప్రవేశం ఎలాంటి నిబంధన లేదు. కుటుంబ సభ్యుల ఒప్పుకుంటేనే తల్లిదండ్రులకు మహిళలు అంతిమ సంస్కరాలు నిర్వహిస్తున్నారు. అయితే అమె కూడా తమ తల్లిదండ్రులకు సంతానంలో భాగమని విస్మరిస్తున్నారు. పురాణాల పరంగానూ స్త్రీలకు శ్మశానాల్లో ప్రవేశం నిషేధించిన దాఖలాలు కూడా లేవు.

శతాబ్దాలుగా సాగుతోన్న పురుషాధిక్యత వల్ల తల్లిదండ్రులకు కొడుకు మాత్రమే అంతిమ సంస్కారాలు నిర్వహించాలనే ధోరణి అలవాటైంది. దీంతో మహిళల పట్ల చిన్నచూపుతో వారిని ఇనుప సంకెళ్లతో బంధించారు. ఇప్పుడిప్పుడే మహిళలు వీటిని నుంచి బయటకు వస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.