యాప్నగరం

కృష్ణుడు ఆజన్మ బ్రహ్మచారి, అందుకే......

మహావిష్ణువు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణుడు. ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించిన నారాయణుడు దుష్ట శిక్షణ గావించాడు. అయితే ఎనిమిది భార్యలు, పదహారువేల మంది గోపికలతో రాసలీలలు సాగించాడని, అతడు శృంగార పురుషడని తెలియనివారు విమర్శిస్తారు.

TNN 1 May 2017, 8:10 pm
మహావిష్ణువు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణుడు. ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించిన నారాయణుడు దుష్ట శిక్షణ గావించాడు. అయితే ఎనిమిది భార్యలు, పదహారువేల మంది గోపికలతో రాసలీలలు సాగించాడని, అతడు శృంగార పురుషడని తెలియనివారు విమర్శిస్తారు. ఏ అవతార పురుషుడూ ఇంత మంది స్త్రీలను భార్యలుగా పొందలేని అంటారు. కేవలం నాస్తికులే కాదు భగవంతుడిని నమ్మేవారు కూడా కృష్ణుడు కామ స్వరూపమేనని భావిస్తారు. కానీ కృష్ణతత్త్వాన్ని తప్పుగా భావించకూడా... ఆయన శిఖలోని నెమలి ఫించం భోగి రూపంలోని యోగేశ్వరుడని తెలియజేయడానికి సంకేతం. అయితే ఆ జగన్నాటక సూత్రధారి లీలలు తెలిసిన వారు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడతారు.
Samayam Telugu why lord krishna wears peacock feather on his head
కృష్ణుడు ఆజన్మ బ్రహ్మచారి, అందుకే......


ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువుండే పవిత్ర గోమాత కృష్ణుడి వెంట ఉంటుంది. కృష్ణుడు ఆజన్మ బ్రహ్మచారి అనే విషయం ఎందరికి తెలుసు. భగవానుడు కాముక జన్ముడు కాదు. కారనజన్ముడు. నరకాసురుడు భైరవ పూజ కోసం భూలోకంలోని రాజ కన్యల్ని అపహరించి పాతాళ గృహంలో బంధింస్తాడు. వారంతా ఎన్నో ఏళ్లు నరకాసురుడి చెరలో బంధీగా ఉండి నరకం అనుభవించారు. నరకాసురుని సంహరించిన కృష్ణుడు రాజ్యాన్ని అతడి కుమారుడికి అప్పగించి, బంధీలుగా ఉన్న కన్యలను వారి దేశాలకు పంపాలని ఆదేశించాడు.

ఆ కన్యలు మాత్రం తమ రాజ్యాలకు వెళ్లడానికి నిరాకరించి కృష్ణుడితోనే ఉంటామని అంటారు. ఎంత వారించినా ఆ 16వేల మంది ద్వారక నగరానికి చేరుకుని కృష్ణుడితో ఉండాలని నిశ్చయించుకుంటారు. వారి కోరికను కృష్ణుడు నిరాకరిస్తాడు. దీంతో ఆ కన్యలు ఆత్మత్యాగానికి సిద్ధపడతారు. తన పట్ల వారి ఆరాధానా భావాన్ని గ్రహించిన కృష్ణుడు తనతో ఉండటానికి అనుమతిస్తాడు.

కృష్ణ సహచర్యాన్ని వరంగా పొందిన ఆ 16వేల మంది ఆయన ప్రమేయం లేకుండా తమను తాము భార్యలుగా భావించుకున్నారు. అంతే గానీ శ్రీకృష్ణుడు భోగలాలసుడు కాదు. ఇక నెమలి ఫించాన్ని అన్ని మతాల వారు పవిత్రంగా భావిస్తారు. ఎంతో పవిత్రమైంది కాబట్టే ముస్లింలు కూడా దర్గాల్లో నెమలి ఫించాన్ని ఉంచుతారు.

దీని పవిత్రతను గుర్తించిన భారత ప్రభుత్వం జాతీయ పక్షిగా నెమలిని ప్రకటించింది. భూమ్మీద స్త్రీ, పురుష సంభోగం లేని ప్రాణి నెమలి ఒక్కటే. మగ నెమలి కంటినీటిని తాగి ఆడ నెమలి గుడ్లు పొదుగుతుంది. తన పవిత్రతను లోకానికి తెలియజేయడానికే పవిత్రమైన నెమలి ఫించాన్ని శ్రీకృష్ణుడు తలపై ధరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.