యాప్నగరం

యూపీ, బిహార్‌లో 51 ఆలయాలను నిర్మిస్తోన్న ముస్లిం

ఒకటీ రెండు కాదు ఏకంగా 51 ఏళ్ల ఆలయాలను నిర్మించడానికి ఓ ముస్లిం వ్యాపారి ముందుకొచ్చి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాడు.

Samayam Telugu 3 Jul 2018, 8:34 am
ఒకటీ రెండు కాదు ఏకంగా 51 ఏళ్ల ఆలయాలను నిర్మించడానికి ఓ ముస్లిం వ్యాపారి ముందుకొచ్చి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాడు. షైన్ వ్యాపార సంస్థల అధిపతి లక్నోకు చెందిన రషీద్ నసీమ్ ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లోని ఆలయాల నిర్మాణానికి భూమితోపాటు ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన సాయంతో ఇప్పటికే అలహాబాద్‌-వారణాసి జాతీయ రహదారిపై తొలి ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ ఆలయం శ్రావణ మాసంలో ప్రారంభం కానుంది. ఈ మొత్తం ఆలయాలను వచ్చే ఏడాది ఆఖరు నాటికి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సమాజంలో లౌకికవాదాన్ని పెంపొందించడమే తన అభిమతని పేర్కొన్న రషీద్‌ నసీమ్‌ ఈమేరకు ప్రకటన చేశారు.
Samayam Telugu యూపీ ముస్లిం రషీద్


దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘ఇది గంగా యమున సరస్వతి త్రివేణి సంగమాన్ని అన్వయించేందుకు వేసిన ఒక అడుగు.. హిందూ, ముస్లిం సంస్కృతుల కలయికను చాటిచెప్పడానికి గొప్ప అవకాశం.. ఒక ముస్లింగా ఇతర మతాల అభివృద్ధికి నేను చేసే కృషిని ఎవరూ ఆపలేదు. మత సామరస్యానికి ఇదో ముందడుగుగా భావిస్తున్నాను. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలను నెలకొల్పేందుకు ఓ సందేశాన్నిచ్చే ప్రయత్నం ఇది. ఈఏడాది ఆఖరు నాటికి 21 ఆలయాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం.’ అని పేర్కొన్నారు. రషీద్ పూర్వీకులు అలహాబాద్‌‌ కాగా, 2013లో స్థిరాస్తి రంగంలోకి ప్రవేశించారు. అనంతరం ట్రావెల్స్‌, పర్యాటకం, వాటర్ ఫిల్టర్స్ వ్యాపారం తదితర రంగాల్లో విస్తరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తాను ప్రేరణ పొందానని చెప్పే రషీద్, వ్యాపార కార్యక్రమాల్లో భాగంగా నెలకు దాదాపు 50 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారు. మన ప్రధాని తరుచూ ప్రయాణిస్తుంటారు.. ఆయనలా నేను కూడా ఎందుకు ప్రయాణించకూడదు? వ్యాపారం కోసం ఎల్లప్పుడూ ప్రయాణించడం మంచిదే, నాకు ఎప్పుడూ విసుగు అనిపించలేదని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.