మనం మరణించాడనికి ముందే యముడు లేఖలు పంపుతాడా? అదేలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ కథ చదవండి మీరూ నమ్ముతారు.. యమునా నది తీరంలోని ఓ గ్రామంలో అమృత అనే ఓ వ్యక్తి నివసించేవాడు. అతడు ప్రతిరోజు నిష్ఠగా యముణ్ని పూజించేవాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు. చావును దూరంగా ఉంచేందుకు యముడితో స్నేహంగా ఉండాలి అనుకునేవాడు. అమృత పూజలకు మెచ్చిన యమధర్మరాజు అతణ్ని స్నేహితుడిగా అంగీకరించాడు. అమృతతో మాట్లాడుతూ.. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు, చనిపోయినవాడు తిరిగి జన్మించక తప్పదు. చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు ఇదే శాశ్వత న్యాయం అని తెలిపాడు.
యముడి మాటలకు అమృత స్పందిస్తూ.. యమధర్మరాజా నన్ను నీ మిత్రుడిగా అంగీకరించారు కదా.. నాకు ఓ చిన్న ఉపకారం చేయండి. ఎలాగో మరణాన్ని తప్పించుకోలేం కదా..! అయితే నేను చనిపోయే ముందే నాకో సందేశం పంపండి. అలా చేయడం వల్ల నా కుటుంబానికి అవసరమైన సదుపాయాలను సమకూర్చగలుగుతాను అన్నాడు. అందుకు అంగీకరించిన యముడు.. మిత్రమా మర్చిపోకు! సందేశం అందిన వెంటనే ఏర్పాట్లు చేసుకోవాలి అని హెచ్చరించి అదృశ్యమయ్యాడు.
ఇది జరిగి చాలా సంవత్సరాలు గడిచాయి. తన మరణానికి ముందే యముడు సందేశం పంపుతాడని అమృత నమ్మకంతో ఉన్నాడు. అకాల మరణానికి సంబంధించిన భయం లేకపోవడంతో పూజాధికాలన్నీ మానేశాడు. కొంత కాలానికి అతడి జుట్టు రంగు మారింది. అయినా యముడి నుంచి అమృతకి సందేశమేదీ రాలేదు. దీంతో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు. మరి కొద్ది సంవత్సరాలు గడిచాయి.. అమృతకు ముసలితనం రావడంతో దంతాలు ఊడిపోయాయి. అయినా తన మిత్రుడి నుంచి ఎలాంటి సందేశమూ రాలేదు.
కొద్ది కాలానికి అతడి చూపు మందగించింది. మరికొంత కాలం తర్వాత పక్షవాతం కారణంగా మంచం మీది నుంచి లేవలేని పరిస్థితి. ఇప్పుడు కూడా యముడి నుంచి అతడికి ఎలాంటి సందేశం అందలేదు. దీంతో అతడు తన మిత్రుడికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు.
ఒకరోజు నిద్రలో ఉండగా ఆశ్చర్యకరంగా యమదూతలు కనిపించారు. దీంతో తన చావుకు సంబంధించి యముడి నుంచి ఏదైనా లేఖ వచ్చిందేమోనని ఇళ్లంతా వెదికాడు. ఎక్కడా ఆ ఉత్తరం కనిపించలేదు. యముడు మాట తప్పడంతో అమృతకు కోపం వచ్చింది. కానీ విధిరాత ముందు తలవంచక తప్పదు కదా! యమదూతలు అతణ్ని యమలోకం తీసుకెళ్లి యముడి ముందు నిలబెట్టారు. అతణ్ని చూడగానే యముడు చిరునవ్వుతో పలకరించాడు. దీంతో అమృతకు చిర్రెత్తుకొచ్చింది.
యమా.. నీవు మాట తప్పావు. మరణానికి ముందే లేఖ పంపుతానని చెప్పావ్.. కానీ పంపలేదు. ఇదేం న్యాయం అని ప్రశ్నించాడు. అమృత మాటలకు స్పందించిన యముడు.. మిత్రమా! నీకు నేను ఒకటి కాదు నాలుగు లేఖలు పంపాను అని చెప్పాడు. దీంతో తనకు ఒక లేఖ కూడా రాలేదు.. బహుశా అవి దారితప్పాయేమో.. అన్నాడు అమాయకంగా.
దీనికి స్పందించిన యమధర్మరాజు అమృతా.. బుర్ర వాడు. నీ శరీరమే కాగితంగా, శారీరకంగా సంభవించే మార్పులే కలంగా నీకు నాలుగు సందేశాలు పంపాను. జుట్టు రంగు మారడం అనేది నేను పంపిన తొలి సందేశం. దంతాలు ఊడిపోవటం రెండోది. చూపు మందగించడం, మంచం మీది నుంచి లేవలేకపోవడం మిగతా రెండు సందేశాలు. నిజమే కదా.. మరణం గురించి ముందుగానే యముడు మనకందరికీ ఇలా సందేశాలు పంపుతూనే ఉన్నాడు. కానీ మనమే పట్టించుకోం.
యముడి మాటలకు అమృత స్పందిస్తూ.. యమధర్మరాజా నన్ను నీ మిత్రుడిగా అంగీకరించారు కదా.. నాకు ఓ చిన్న ఉపకారం చేయండి. ఎలాగో మరణాన్ని తప్పించుకోలేం కదా..! అయితే నేను చనిపోయే ముందే నాకో సందేశం పంపండి. అలా చేయడం వల్ల నా కుటుంబానికి అవసరమైన సదుపాయాలను సమకూర్చగలుగుతాను అన్నాడు. అందుకు అంగీకరించిన యముడు.. మిత్రమా మర్చిపోకు! సందేశం అందిన వెంటనే ఏర్పాట్లు చేసుకోవాలి అని హెచ్చరించి అదృశ్యమయ్యాడు.
ఇది జరిగి చాలా సంవత్సరాలు గడిచాయి. తన మరణానికి ముందే యముడు సందేశం పంపుతాడని అమృత నమ్మకంతో ఉన్నాడు. అకాల మరణానికి సంబంధించిన భయం లేకపోవడంతో పూజాధికాలన్నీ మానేశాడు. కొంత కాలానికి అతడి జుట్టు రంగు మారింది. అయినా యముడి నుంచి అమృతకి సందేశమేదీ రాలేదు. దీంతో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు. మరి కొద్ది సంవత్సరాలు గడిచాయి.. అమృతకు ముసలితనం రావడంతో దంతాలు ఊడిపోయాయి. అయినా తన మిత్రుడి నుంచి ఎలాంటి సందేశమూ రాలేదు.
కొద్ది కాలానికి అతడి చూపు మందగించింది. మరికొంత కాలం తర్వాత పక్షవాతం కారణంగా మంచం మీది నుంచి లేవలేని పరిస్థితి. ఇప్పుడు కూడా యముడి నుంచి అతడికి ఎలాంటి సందేశం అందలేదు. దీంతో అతడు తన మిత్రుడికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు.
ఒకరోజు నిద్రలో ఉండగా ఆశ్చర్యకరంగా యమదూతలు కనిపించారు. దీంతో తన చావుకు సంబంధించి యముడి నుంచి ఏదైనా లేఖ వచ్చిందేమోనని ఇళ్లంతా వెదికాడు. ఎక్కడా ఆ ఉత్తరం కనిపించలేదు. యముడు మాట తప్పడంతో అమృతకు కోపం వచ్చింది. కానీ విధిరాత ముందు తలవంచక తప్పదు కదా! యమదూతలు అతణ్ని యమలోకం తీసుకెళ్లి యముడి ముందు నిలబెట్టారు. అతణ్ని చూడగానే యముడు చిరునవ్వుతో పలకరించాడు. దీంతో అమృతకు చిర్రెత్తుకొచ్చింది.
యమా.. నీవు మాట తప్పావు. మరణానికి ముందే లేఖ పంపుతానని చెప్పావ్.. కానీ పంపలేదు. ఇదేం న్యాయం అని ప్రశ్నించాడు. అమృత మాటలకు స్పందించిన యముడు.. మిత్రమా! నీకు నేను ఒకటి కాదు నాలుగు లేఖలు పంపాను అని చెప్పాడు. దీంతో తనకు ఒక లేఖ కూడా రాలేదు.. బహుశా అవి దారితప్పాయేమో.. అన్నాడు అమాయకంగా.
దీనికి స్పందించిన యమధర్మరాజు అమృతా.. బుర్ర వాడు. నీ శరీరమే కాగితంగా, శారీరకంగా సంభవించే మార్పులే కలంగా నీకు నాలుగు సందేశాలు పంపాను. జుట్టు రంగు మారడం అనేది నేను పంపిన తొలి సందేశం. దంతాలు ఊడిపోవటం రెండోది. చూపు మందగించడం, మంచం మీది నుంచి లేవలేకపోవడం మిగతా రెండు సందేశాలు. నిజమే కదా.. మరణం గురించి ముందుగానే యముడు మనకందరికీ ఇలా సందేశాలు పంపుతూనే ఉన్నాడు. కానీ మనమే పట్టించుకోం.