యాప్నగరం

Paush Purnima 2023 పుష్య పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తే ఆదాయానికి లోటనేదే ఉండదట...!

Paush Purnima 2023 ఆంగ్ల నూతన సంవత్సరంలో 6 జనవరి 2023 శుక్రవారం రోజున పుష్య పౌర్ణమి వచ్చింది. ఈ పౌర్ణమి శుక్రవారం రోజున రావడంతో ఈ రెండూ లక్ష్మీదేవికి అంకితం చేయబడ్డాయి. ఈ సమయంలో కొన్ని ప్రత్యేక పనులు చేయడం వల్ల సంపదను పెంచుకోవచ్చు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 4 Jan 2023, 7:48 pm
Paush Purnima 2023 తెలుగు పంచాంగం ప్రకారం, ఈనెల 6వ తేదీన అంటే శుక్రవారం నాడు పుష్య పౌర్ణమి వచ్చింది. ఈ పర్వదినాన చంద్రునితో పాటు లక్ష్మీనారాయణుడిని పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో ఎలాంటి ఆటంకాలు రావని, జీవితాంతం ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ పుష్య పూర్ణిమను శాకంబరి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ రోజున బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేవాలి. పుష్య పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. నదిలో స్నానం చేసేందుకు వీలు కాని వారు ఇంట్లో ఉన్న నీటిలో కొంత గంగాజలం వేసి స్నానం చేయాలి.
Samayam Telugu purnima pooja


ఉతికిన బట్టలు వేసుకుని ఉపవాస వ్రతం ఆరంభించిన అనంతరం సింధూరం, ఎర్రని దారం, పసుపు రంగు పువ్వులు, పండ్లు, తీపి పదార్థాలు, పంచామృతాలతో లక్ష్మీ నారాయణులను పూజించాలి. శ్రీ హరి భజన కీర్తనలను జపించాలి.

Mauni Amavasya 2023 కొత్త ఏడాదిలో మౌని అమావాస్య ఎప్పుడొచ్చింది... దీని ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి...

ఇదే రోజున సాయంత్రం పాలలో పంచదారి, వండిన అన్నం కలిపి చంద్రునికి నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి తమ ఇంట్లోనే నివసిస్తుందని పెద్దలు చెబుతారు.
పుష్య పూర్ణిమ రోజున రాత్రి సమయంలో దక్షిణవర్తి శంఖంలో గంగాజలం, కుంకుమ కలిపి శ్రీ హరి విష్ణువుకు అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఆర్థిక సంక్షోభాలేవీ రాకుండా అనుగ్రహిస్తుంది.

ఇదే రోజున చీమలకు పిండిలో పంచదార కలిపి తినిపించడం వల్ల మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు.

పుష్య పూర్ణిమ రోజున గజలక్ష్మీని పూజించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం చేకూరుతుంది. ఇదే రోజున రాత్రి గజలక్ష్మీ మాతను స్మరిస్తూ ‘ఓం శ్రీ హ్రీ క్లీం గజ లక్ష్మియై నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు స్మరించుకోవాలి.

పుష్య పూర్ణిమ రోజున అర్ధరాత్రి సమయంలో అష్టలక్ష్ముల పూజ చేయాలి. లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. మన సంపాదనకు ఎలాంటి ఆటంకాలనేవి రావు. ఆదాయానికి లోటు అనేదే ఉండదు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.