యాప్నగరం

గురువారం ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ నియమాలు తప్పనిసరి!

గురువారం పూట ఉపవాసం చేసే వాళ్లు ఎంతో మంది ఉంటారు. అయితే అసలు గురువారం ఉపవాసం ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? అనే ప్రశ్నలు మాత్రం ఉత్పన్నమవుతాయి. గురువారం పూజా విధానం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Samayam Telugu 14 May 2020, 8:08 am
ఉపవాసం అంటే తినకుండా ఉండటం కాదు.. దేవుడికి దగ్గరగా ఉండటం. అంటే ధ్యాస భగవంతుడు మీద పెట్టి ఆ రోజు ఆయనకు కేటాయించడం. ఉపవాస ప్రక్రియ వల్ల ప్రజలకు ఆధ్యాత్మిక, శారీరక ప్రయోజనాలను చేకూరుస్తుంది. అంతేకాకుండా భగవంతుడి ఆశీర్వాదాలు పొందడానికి అవకాశాన్ని ఇస్తుంది. గురు లేదా బృహస్పతి రోజుగా గురవారాన్ని పాటిస్తారు. హిందూ పవిత్ర గ్రంథాల ప్రకారం బృహస్పతి శివుడు గొప్ప భక్తుడు. బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు గురువారం ఉపవాసాలు పాటిస్తారు. ఈ విధానం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలేమైనా ఉంటే అవి తొలగుతాయి. గురువారం ఉపవాసం చేయడం వల్ల వ్యక్తి ఆరోగ్యం, ఆర్థిక స్ధితి మెరుగవుతుంది.
Samayam Telugu గురువారం పూజావిధానం


Also Read: Tulasi: తులసి మొక్క వల్ల ప్రయోజనమేంటి.. అసలు ఎందుకు పూజిస్తారు?

ఉపవాసాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలంటే..
ఉపవాసాన్ని ఏ నెలలోనైనా అందులో ఏ గురువారం నుంచైన ప్రారంభించవచ్చు. అయితే పుష్యమాసం నుంచి మాత్రం మొదలుపెట్టకూడదు. అయితే మీరు ఏ నెల నుంచి ఉపవాసం ప్రారభించినా శుక్ల పక్షంలోని మొదటి గురువారం నుంచి మొదలు పెడితే ఎంతో మంచిది. ఈ ఉపవాసం 16 గురవారాలు పాటు చేయాలి. మూడు సంవత్సరాల వరకు కూడా పాటించవచ్చు.

గురువారం ఉపవాసం చేసే విధానం..
  1. ఉపవాసం చేసేందుకు శ్రీ మహావిష్ణువు ఫొటోతో పాటు కాయధాన్యాలు, పసుపు, బెల్లం, అరటిపండు అవసరం. కావాలనుకుంటే ఈ రోజు అరటి చెట్టును కూడా పూజించవచ్చు. ఉదయాన్ని నిద్రలేచి తలంటి స్నానమాచరించాలి. అనంతరం భగవంతుడు ఫొటోను శుభ్రపరచుకోవాలి. తర్వాత కొద్దిగా నీటిని తీసుకుని అందులో పసుపు వేసి విష్ణువును ఆ మిశ్రమంతో తడపాలి.
  2. అనంతరం పవిత్రంగా ఉండేందుకు భగవంతుడు ఫొటోపై పసుపు వస్త్రాన్ని ఉంచాలి. తర్వాత స్వామికి బియ్యం సమర్పించాలి. అనంతరం భగవంతుడు కథను పఠించాలి. నెయ్యితో దీపాన్ని వెలిగించి స్వామిని సేవించవచ్చు. తప్పని సరిగా పసుపు రంగులో ఉండే మిఠాయిని స్వామికి సమర్పించాలి.
  3. గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. బృహస్పతికి పూజ చేసిన అనంతరం మీరు భుజించాలి. ఈ రోజు పూర్తిగా తల కడగడం లేదా ఉప్పు కలిగిన భోజనం తినడం మానుకోవాలి. భగవంతుడు కథ వినడం లేదా చదవడం ద్వారా ఉపవాసం ముగించాలి. అరటి చెట్టును పూజించాలనుకునేవాళ్లు. నెయ్యితో తయారు చేసిన దీపాన్ని చెట్టు ముందు ఉంచాలి. అరటి చెట్టును శుభ్రపరిచి శనగలు, పసుపు అర్పించాలి. అంతేకాకుండా గురువారం రోజు పసుపు రంగు బట్టలను దానం చేస్తే మంచిది.
Also Read: రాముడు-హనుమంతుడు మధ్య యుద్ధం.. ఆంజనేయుడు గురించి ఆసక్తికర అంశాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.