యాప్నగరం

Puja Rituals in Telugu దేవుళ్లను ఆరాధించే వేళ నైవేద్యాలను ఎందుకు సమర్పిస్తారంటే...

Puja Rituals in Telugu హిందూ మతంలో పూజ చేసే సమయంలో పూలు, పండ్లతో పాటు కొన్ని వస్తువులను కచ్చితంగా వాడతారు. దేవుడిని ఆరాధించేటపుడు నైవేద్యాన్ని ఎందుకు సమర్పిస్తారు.. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 5 Dec 2023, 7:27 pm
Puja Rituals in Telugu మన దేశంలో పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు అనేక సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా హిందూ మతంలో ఏదైనా పండుగలొచ్చినా.. ప్రత్యేక సందర్భాలొచ్చినా పూజలు నిర్వహిస్తారు. అయితే ఇలా చేసే పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పూజల సమయంలో దేవుడిని ఆరాధించే వారు కచ్చితంగా పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, నైవేద్యాలను కచ్చితంగా సమర్పిస్తారు. ఈ సందర్భంగా దేవుడికి వీటిని ఎందుకు సమర్పిస్తారు.. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Puja rituals


మనలో ప్రతి ఒక్కరూ భగవంతుడిని ఆరాధిస్తారు. ఆరాధించే సమయంలో కొన్ని పండ్లు, పూలను కచ్చితంగా సమర్పిస్తారు. అయితే మనం దేవుడిని పూజించే సమయంలో ఎలాంటి సుగంధ ద్రవ్యాలు, పండ్లు, నైవేద్యాలు సమర్పిస్తారనేది వారి సొంత ఇష్టాలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు పరమేశ్వరుని పూజించేటప్పుడు శివుడికి జలాభిషేకం చేయాలి. శత్రువులపై గెలుపు సాధించాలనుకునే వారు ఆహుతిలో ఆవనూనె సమర్పించాలి. దుర్గామాత లేదా నవగ్రహాలను శాంతింపజేయడానికి నువ్వులను సమర్పిస్తూ ఉంటారు. ఇలా రకరకాల ఆహార పదార్థాలను సమర్పిస్తూ ఉంటారు. వీటిని వాడటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

New Year 2024 కొత్త ఏడాదిలో ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే.. ఏడాదంతా డబ్బు సమస్యలనేవే ఉండవట..!

కొబ్బరికాయ..
మనలో గుడికి వెళ్లే వారిలో చాలా మంది కొబ్బరికాయ లేకుండా వెళ్లరు. అలాగే ఇంట్లో ఏదైనా ప్రత్యేక పూజలు చేసే సమయంలో కూడా కచ్చితంగా కొబ్బరికాయను కొడతారు. దేవతలను ప్రశాంతంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా సమర్పించాలని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు నందితా పాండే వివరించారు. ఇంకా ఏయే వస్తువులను సమర్పించాలి.. ఏవి వాడితే ఎలాంటి ఫలితాలొస్తాయో ఇప్పుడు చూడండి..
దేవుళ్లను ఆరాధించే సమయంలో కొబ్బరికాయతో పాటు పండ్లను కూడా కచ్చితంగా సమర్పించాలి. ఉదాహరణకు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దానిమ్మ పండ్లను, విష్ణుమూర్తికి అరటి పండ్లను సమర్పిస్తారు. ఇలా పండ్లను సమర్పించడం వల్ల మానసికంగా బలం పెరుగుతుందని, ఆధ్యాత్మిక పరిపక్వత పొందే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

సుగంధ ద్రవ్యాలు..
లక్ష్మీదేవి నుంచి ఆంజనేయుడి వరకు మనం చేసే పూజల్లో లవంగాలను కూడా వాడుతుంటారు. వీటిని వాడటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎవరైతే జీవితంలో కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటు ఉంటారో, రాహు, కేతువులను శాంతింపజేయడానికి, శివలింగానికి శనివారం రోజున మసాలలను నైవేద్యంగా సమర్పించాలి.
తియ్యని పదార్థాలు..
దేవుళ్లకు సమర్పించే పదార్థాలలో నైవేద్యం కచ్చితంగా ఉంటుంది. అయితే అందులోనూ తీపి పదార్థాలను ఎక్కువగా సమర్పిస్తారు. వీటిని రుచి చూసేందుకు దేవతలందరూ ఆహ్వానించబడతారు. ఎవరైతే భక్తులు భక్తి శ్రద్ధలతో వీటినన్నింటినీ సమర్పిస్తే దేవుళ్ల అనుగ్రహం కచ్చితంగా లభిస్తుంది.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.