యాప్నగరం

Teertham in Temples గుడిలో తీర్థం ఎలా తీసుకోవాలి... తీర్థాన్ని తీసుకునేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలంటే...

Teertham in Temples మనలో గుడికి వెళ్లే ప్రతి ఒక్కరూ కచ్చితంగా తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తుంటారు. ఈ తీర్థాన్ని పూజ చేసిన తర్వాతే పండితులు మనకు అందజేస్తారు. అయితే ఈ తీర్థాన్ని ఎలా తీసుకోవాలి.. ఏయే నియమాలు పాటించాలంటే...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 14 Mar 2023, 1:28 pm

ప్రధానాంశాలు:

  • తీర్థం తీసుకునే పద్ధతులు..
  • తీర్థాన్ని తీసుకున్నాక తలకు చేత్తో రాయకండి..
  • తీర్థం తీసుకునే వేళ ఈ తప్పులు చేయకండి..
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu teertham in temple
Teertham in Temples హిందూ మత విశ్వాసాల ప్రకారం, భగవంతుడిని ఆరాధించడం పూర్తయిన తర్వాత తీర్థం తీసుకోవడాన్ని పుణ్య కార్యంగా భావిస్తారు. అందుకే ఏ గుడికి వెళ్లినా ప్రతి ఒక్కరూ పండితుల నుంచి పవిత్ర జలాన్నీ స్వీకరిస్తారు. ఈ తీర్థాన్ని హస్త గోకర్ణ ముద్ర వేసి తీసుకుంటూ ఉంటారు. ఈ ముద్రలో బోటనవేలు చూపుడువేలిని నియంత్రిస్తుంది. చివరి మూడు వేళ్లు మాత్రమే ముందుకు సాగుతాయి. ఈ ముద్రలో భక్తులందరూ భగవంతుని పవిత్ర జలాన్ని తీసుకుని నోటిలో వేసుకోవాలి. తీర్థం తీసుకునేటప్పుడు కొద్దిగానే తీసుకోవాలి. ఈ సందర్భంగా తీర్థాన్ని ఇలాగే ఎందుకు తీసుకోవాలి.. ఆలయంలో తీర్థం తీసుకునే విధానాలు.. తీర్థానికి ఉన్న ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
తీర్థాన్ని ఎన్నిసార్లు తీసుకోవాలి..
హిందూ గ్రంథాల ప్రకారం, ఇంట్లో అయినా, ఆలయంలో అయినా పూజ చేసిన తర్వాతే తీర్థాన్ని తీసుకోవాలి. ఇంట్లో అన్నం తినే అవకాశం లేనివారు మూడుసార్లు తీర్థం చేసుకోవాలి. అదే గుడికి వెళ్లినప్పుడు ఒకసారి మాత్రమే తీర్థాన్ని తీసుకోవాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండే భక్తులందరూ, ఉపవాసం తర్వాతి రోజు సూర్యోదయం వేళ మరోసారి తీర్థం తీసుకోవాలి. అప్పుడే మీ ఉపవాసం ముగింపును సూచిస్తుంది.

Ugadi Asthanam 2023 ఈసారి తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం ఎప్పటినుంచంటే...
ఎప్పుడు తీసుకోకూడదంటే..
మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతున్న సమయంలో, ఉదయం పూజ చేసిన వెంటనే పవిత్ర జలాన్ని తీసుకోరాదు. అయితే మహాపూజ లేదా శ్రాద్ధం తర్వాత, సత్యనారాయణ కథ వినడానికి ముందు తీర్థ జలాన్ని తీసుకోవాలి.
తీర్థాలలో రకాలు..
తీర్థాలలో నాలుగు రకాలుంటాయి. అందులో మొదటి జల తీర్థం.. రెండోది కషాయ తీర్థం.. మూడోది పంచామృత తీర్థం, నాలుగో పానక తీర్థం.. వీటితో పాటు తులసి తీర్థం, బిల్వ తీర్థం, పచ్చకర్పూర తీర్థాలను ప్రత్యేక సందర్భాల్లో పంచుతారు. వీటిని సేవించడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
తీర్థం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు..
జల తీర్థం తీసుకుంటే అకస్మాత్తుగా మరణం సంభవించకుండా, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు సకల పాపాలన్నీ తొలగిపోతాయి. మీ వ్యక్తిగత జీవితంలో శుభ ఫలితాలొస్తాయి.
కషాయ తీర్థాన్ని ఎక్కువగా రాత్రి పూజ పూజ చేసిన తర్వాత భక్తులకు పంచుతారు. ఈ తీర్థాన్ని స్వీకరించిన వారికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు.
పంచామృత అభిషేకం చేసిన తీర్థం స్వీకరించడం వల్ల మనం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. చివరగా పానక తీర్థం స్వీకరించడం వల్ల అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ తీర్థాన్ని నరసింహ స్వామి ఆలయాల్లో ఎక్కువగా పంచుతారు.
ఎలాంటి పొరపాట్లు చేయకూడదంటే..
మనలో చాలా మంది కుడి చేత్తో తీర్థం తీసుకున్న వెంటనే.. ఆ చేతిని తలపై రాసుకుంటూ ఉంటారు. అయితే అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే తలపై బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలి చేతిని బ్రహ్మకు అర్పించిన వారవుతాం. అలాగే తీర్థం తాగేటప్పుడు శబ్దం రాకుండా చూసుకోవాలి.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.