యాప్నగరం

సేవ్ శబరిమల: టీవీ ఛానెల్ ఆఫీస్ ఎదుట అయ్యప్ప భక్తుల ఆందోళన

‘శబరిమలను కాపాడండి’ అంటూ నినాదాలు చేస్తూ.. మోజో టీవీ ఆఫీసు ఎదుట అయ్యప్ప భక్తులు ఆందోళన చేపట్టారు.

Samayam Telugu 19 Oct 2018, 3:48 pm
హైదరాబాద్‌లోని మోజో టీవీ ఆఫీసు ఎదుట అయప్ప భక్తులు ఆందోళన చేపట్టారు. ‘శబరిమలను కాపాడండి’ అంటూ నినాదాలు చేశారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం ద్వారా రిపోర్టర్ కవిత తమ మనోభావాలను దెబ్బతీసిందని వారు ఆరోపించారు. లైవ్ డిబేట్‌లోనూ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆమె భర్త మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. దీంతో టీవీ ఛానెల్ డైరెక్టర్‌కు లిఖిత పూర్వకంగా లేఖ అందించాలని పోలీసులు వారికి సర్ది చెప్పారు.
Samayam Telugu save sabarimala


శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చెందిన టీవీ రిపోర్టర్ జక్కల్ కవిత, కొచ్చికి చెందిన రెహానా ఫాతిమా శబరిమల వేర్వేరుగా శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పంబ నుంచి శబరిమల కాలినడక బయల్దేరిన వీరు.. పోలీసుల పటిష్ట భద్రత నడుమ ఆలయానికి చేరువగా వెళ్లారు. మరో అర కి.మీ. వెళ్తే వీరు గుడిలోకి ప్రవేశించేవారే. కానీ నిషేధిత వయసులోని మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే.. పూజాధికాలు నిలిపేసి, గుడిని మూసివేస్తామని పూజారులు హెచ్చరించారు. దీంతో పోలీసుల సర్ది చెప్పడంతో.. దర్శనం చేసుకోకుండానే కవిత, ఫాతిమా శబరిమల నుంచి వెనక్కి మళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.