యాప్నగరం

అయ్యప్పకు మహావైభవ పడిపూజ!

స్వామి పరిపూర్ణానంద ఆశీస్సులతో రాష్ట్రీయ హిందూ సేన డిసెంబర్ 3న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 108 పడులతో మహా వైభవ పడి పూజ నిర్వహించనుంది.

TNN 27 Nov 2017, 7:42 pm
స్వామి పరిపూర్ణానంద ఆశీస్సులతో రాష్ట్రీయ హిందూ సేన డిసెంబర్ 3న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 108 పడులతో మహా వైభవ పడి పూజ నిర్వహించనుంది. శబరిమల అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి 50వేల మందికిపైగా అయ్యప్ప భక్తులు హాజరుకానున్నారని శబరిమల అయ్యప్ప సేవా సమాజం తెలియజేసింది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను స్వామి పరిపూర్ణానంద ఆవిష్కరించారు. కేరళలో తొమ్మిదేళ్ల కిందట శబరిమల అయ్యప్ప సేవా సమాజం ప్రారంభమైందని, ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని సేవా సమాజం సభ్యుడు ఐత రాములు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి దిగ్విజయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌కు దరఖాస్తు చేస్తున్నట్టు అయ్యప్ప సేవా సమాజం వెల్లడించింది.
Samayam Telugu ayyappa swamy maha vaibhava padi puja
అయ్యప్పకు మహావైభవ పడిపూజ!


శబరిమల సన్నిధానంలో ఉండే 18 మెట్లకు విశేష ప్రాధాన్యత ఉంది. దుష్ట శక్తులను సంహరించడానికి అయ్యప్పస్వామి ఉపయోగించిన 18 ఆయుధాలుగా వీటిని పేర్కొంటారు. స్వామి సన్నిధానంలో విగ్రహరూపం దాల్చకముందు ఆ ఆయుధాలను ఒక్కో మెట్టు వద్ద ఉంచారని అంటారు. స్వామి ఆలయానికి చేరుకోవాలంటే 18 కొండలను కూడా దాటాలి. ఆ 18 కొండలను ఈ 18 మెట్లు సూచిస్తాయని కొందరంటారు. 18 మెట్లు 18 పురాణాలను సూచిస్తాయని, రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల్లో 18 అధ్యాయాలు ఉన్నాయి. భగవద్గీతలోనూ 18 అధ్యాయాలు ఉన్నాయి. ఇలా 18 సంఖ్యకు.. అయ్యప్ప సన్నిధిలోని 18 మెట్లకు సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ 18 మెట్లను ఎవరైతే దాటుకుంటూ వెళ్తారో వారికి ‘పుణ్యదర్శనం’ లభిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.